జిల్లావ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
కేక్లు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబురాలు
ఆసిఫాబాద్టౌన్,జూలై 24: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు కేక్లు కట్ చేసి, స్వీట్లు పంచిపెడుతూ సంబురాలు జరుపుకున్నారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అన్నివర్గాల ప్రజలు తలా మూడు మొక్కలు నాటి అమాత్యుడిపై అభిమానాన్ని చాటుకున్నారు. నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని, భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, నాయకులు శ్రీనివాస్, కార్తిక్, శైలేశ్, జావీద్ పాల్గొన్నారు. మండలంలోని గుండి సర్పంచ్ అరుణ, నాయకులతో కలిసి గంటలో వెయ్యి మొక్కలు నాటారు. బూరుగూడలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, ఎంపీడీవో శశికళ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భీమేశ్,ఎంపీవో ప్రసాద్, ఏపీవో చంద్రశేఖర్, ఎంపీటీసీ రమేశ్, ఏఎంసీ డైరెక్టర్ శ్యామ్ రావు, ఉప సర్పంచ్ శేషాద్రి, నాయకులు శ్రీనివాస్,బాలేశ్ గౌడ్, మల్లేశ్, గోపాల్, రవీందర్, ప్రవీణ్, శేఖర్ గౌడ్, నవీన్, సందీప్ పాల్గొన్నారు.
కెరమెరి, జూలై 24: మండలంలోని హట్టి పల్లె ప్రకృతివనంలో జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కేక్ కట్ చేశారు. మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, వైస్ ఎంపీపీ అబుల్ కలాం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునీర్ అహ్మద్, సర్పంచ్లు రాథోడ్ బయనాబాయి, కుమ్రం నానేశ్వర్, ఎస్ఐ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిర్యాణి,జూలై24: ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపులా 5వేలకు పైగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ సుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఆసిఫాబాద్ ఏఎంసీ డైరెక్టర్ తాళ్ల శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు హన్మాండ్ల జగదీశ్, ముత్యం రాజయ్య, కాసం రాజయ్య, స్కిలిశెట్టి శంకరయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
రెబ్బెన, జూలై 24 : మండలంలోని 24 పంచాయతీల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్పర్సన్ పర్లపల్లి వనజ, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, పీఎసీఎస్ చైర్మన్ సంజీవ్కుమార్, వైస్ చైర్మన్ మహేశ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు జౌరొద్దీన్, ఆలయ చైర్మన్ వెంకటేశం చారి, డైరెక్టర్ మల్లేశ్, కడతల మల్లయ్య, సర్పంచ్లు చెన్న సోమశేఖర్, పోటు సుమలత, బొమ్మినేని అహల్యదేవి, పందిర్ల వినోద, మల్లేశ్, ఉపసర్పంచ్లు మడ్డి శ్రీనివాసగౌడ్, దేవానంద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, జిల్లా కార్యదర్శి కుందారపు శంకరమ్మ, మాజీ ఉపసర్పంచ్ శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో..
బెల్లంపల్లి ఏరియాలోని వివిధ గనులు, డిపార్టుమెంట్లలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు, కేంద్ర కమిటీ సభ్యుడు అబ్బు శ్రీనివాసరెడ్డి, జీఎం సభ్యులు వెంకటేశ్వర్లు, సమ్మయ్య, రాజన్న, పిట్ కార్యదర్శులు మెరుగు రమేశ్, కార్నాథం వెంకటేశం, నాయకులు స్వరూప, శ్రీనివాస్, మంగీలాల్, రమేశ్, లస్మయ్య, ఓరం కిరణ్, వీరాస్వామి, మహేందర్రెడ్డి, సంపత్, సారయ్య, వినయ్కుమార్, మురళీకృష్ణ, అజాస్ పాల్గొన్నారు.
జైనూర్, జూలై 24: జైనూర్, పాట్నాపూర్లో జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కేక్ కట్ చేశారు. పంచాయతీ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. రహదారికి ఇరువైపులా 200 మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్ లాలా, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ కనక యాదోరావ్, ఏఎంసీ చైర్మన్ ఆత్రం భగవంత్రావ్, ఎంపీపీ తిరుమల, వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ కొడప హన్ను పటేల్, సిర్పూర్(యూ) వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాశ్, సీనియర్ నాయకులు మెస్రం అంబాజీ, కోఆప్షన్ సభ్యుడు ఫిరోజ్ఖాన్, సర్పంచ్లు బాలాజీ, సవిత, రాందాస్, భీంరావ్, కేశవ్, దిగంబర్, పూసం రాము, శ్యాంరావ్, పార్వతి, లక్ష్మణ్, ప్రభుదయ, మల్లయ్య పాల్గొన్నారు.
లింగాపూర్, జూలై 24: టీఆర్ఎస్ నాయకులు మండలంలో రెండు వేల మొక్కలు నాటారు. ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షుడు ఆత్రం వినోద్, ప్రత్యేక అధికారి శ్యాంరావ్, ఎంపీడీవో ప్రసాద్, ఎంపీపీ సవిత, వైస్ ఎంపీపీ ఆడే ఆత్మారాం, జడ్పీటీసీ రక్కాబాయి, కో ఆప్షన్ సభ్యుడు సలీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగీత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్ కుమార్ పాల్గొన్నారు.
కౌటాల, జూలై 24 : మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం వద్ద మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్ సర్పంచ్ మౌనీశ్, డీజీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య, కోఆప్షన్ సభ్యుడు అజ్మత్, ఉప సర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు నరేందర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు సంతోష్, నయీం, రవి, రాంచందర్, రాము, పవన్, ప్రభాకర్ గౌడ్, అంజన్న ఉన్నారు.
చింతలమానేపల్లి, జూలై 24: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి కేక్కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్, కాగజ్నగర్ ఏఎంసీ వైస్ చైర్మన్ డోకె రాజన్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ టోంబిరె మారుతి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ భీంకరి నారాయణ, జాగృతి అధ్యక్షుడు లాట్కరి శంకర్, ఎంపీటీసీ జాబొరి రాజన్న, సర్పంచ్ రాఘవరెడ్డి, ఉప సర్పంచ్ మహేశ్, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ టౌన్, జూలై 24: స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సద్దాం హుస్సేన్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గిరీశ్ కుమార్, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు జై చందర్, బంక శివకుమార్, సునీల్, మదన్, ఎల్లేశ్, వలీ, సాగరిక, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పెంచికల్పేట్ , జూలై 24: చేడ్వాయి అటవీక్షేత్రంలో జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, జడ్పీటీసీ సముద్రాల సరిత మొక్కలు నాటి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లోడ్పల్లి సర్పంచ్ జాజిమొగ్గ శ్రీనివాస్, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, డీఆర్వోలు రమాదేవి, ప్రభాకర్,నాయకులు సముద్రాల రాజన్న, చౌదరి బండు, ఎఫ్ఎస్వోలు,ఎఫ్బీవోలు, వాచర్స్ పాల్గొన్నారు.
సిర్పూర్(టీ), జూలై 24 మండలంలోని వెంపల్లి శివారులో సిర్పూర్(టీ) మండల ఉపాధ్యక్షుడు ఈర్త సత్యనారాయణ, అటవీ అధికారులు మొక్కలను నాటారు. సర్పంచ్ డోల్లి లక్ష్మి,అటవీ అధికారులు పాల్గొన్నారు.