మందమర్రిలో రూ.3.60 లక్షలు, లక్షెట్టిపేటలో రూ.లక్ష విలువ గల ప్యాకెట్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన పోలీసులు
మందమర్రి, జూలై 24 : మందమర్రి పట్టణంలోని యా పల్ ఏరియాకు చెందిన పిండి సురేశ్ ఇంటి వద్ద రూ.3.60 లక్ష ల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. మందమర్రి పోలీస్స్టేషన్లో శనివా రం టాస్క్ఫోర్స్ సీఐ మహేందర్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిండి సురేశ్ మహారాష్ట్ర నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేసుకుంటున్నాడన్న సమాచారం మేరకు మందమర్రి పోలీసులతో కలిసి అత ని ఇంటి వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదే క్రమం లో ఎంహెచ్ 30 బీడీ 3383 నంబర్ గల ఆటో ట్రాలీలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను తీసుకవచ్చి, డ్రైవర్ హుస్సేన్ దింపుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. వాటి విలువ రూ.3.60 ల క్షలు ఉంటుందన్నారు. పిండి సురేశ్, మహారాష్ట్రలోని సాయినగర్ అఖోలాకు చెందిన మహబూబ్ పరారీలో ఉన్నారని తెలిపారు. పొగాకు ఉత్పత్తులను విచారణ కోసం మందమర్రి పోలీ స్ స్టేషన్కు తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ దాడిలో మం దమర్రి ఎస్ఐ ఎల్ భూమేశ్, రమేశ్, టాస్క్ఫోర్స్ ఎస్ఐ లచ్చ న్న, సిబ్బంది సంపత్ కుమార్, రాకేశ్, శ్రీనివాస్, శ్యాంసుందర్, సదానందం గౌడ్, వెంకటేశ్, ఓంకార్, కిరణ్ ఉన్నారు.
రూ.లక్ష అంబార్ ప్యాకెట్ల పట్టివేత..
లక్షెట్టిపేట రూరల్, జూలై 24 : లక్షెట్టిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని సాదు శ్రీనివాస్ కిరాణా దుకాణంలో రూ.లక్ష విలువ గల 400 వందల అంబార్ ప్యాకెట్లను పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. అంబార్ ప్యాకెట్లు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అతని ఇంటి పరిసరాల్లో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు రూ.లక్ష విలువ గల ప్యాకెట్లు దొరికినట్లు తెలిపారు. సాదు శ్రీనివాస్, సిద్దిపేట నుంచి లక్షెట్టిపేటకు అంబార్ ప్యాకెట్లు తరలిస్తున్న సిద్దిపేటకు చెందిన మల్యాల చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నట్లు, సరఫరా చేస్తున్న మరో వ్యక్తి సిద్దిపేటకు చెందిన టీ సాయి పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది సంపత్కుమార్, రాకేశ్, శ్యాంసుందర్, సదానందం గౌడ్ పాల్గొన్నారు.