సెకండ్ వేవ్లో కేసులు నిల్
కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు
ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం
హాజీపూర్, మే 23 : కరోనా మహమ్మారి ఓ వైపు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నాగారం గ్రామానికి దరిచేరలేదు. గ్రామస్తులు కొవిడ్ నిబంధనలు పక్కా గా పాటిస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నాగారం గ్రామం మంచిర్యాల జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఎక్కువగా అటవీ ప్రాంతం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. గ్రామంలో 85 ఇండ్లు ఉండగా, 300 మంది జనాభా నివసిస్తున్నారు. వీరంతా గిరిజనులే. వ్యవసాయం , చేపలు పట్ట డం, ఉపాధి హామీ పనులకు వెళ్లడం వీరి దినచర్య. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి ఒక్క పాటిజివ్ కేసు కూడా నమోదు కాలేదు. కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించడంతోనే ఇది సాధ్యమైందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామస్తులు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లకపోవడం, ఇతరులు వచ్చినప్పటికీ మాస్కులు ధరిం చి, భౌతికదూరం పాటిస్తూ మాట్లాడుతున్నారు. కొంతమంది మంచిర్యాలకు వివిధ పనుల కోసం వెళ్లినవారు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కష్టపడి పని చేయడం అంబలి, గట్క తినడంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. పంచాయతీ ఆధ్వర్వంలో నిత్యం పారిశుధ్య పనులు చేపట్టడం, వారంలో రెండుసార్లు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. దీంతో పాటు ఆశ కార్యకర్తలు కరోనా వైరస్పై అవగాహన కల్పించడంతో పాటు గ్రామంలో ఇటీవలే జర్వ సర్వేను పూరి చేసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం ..
కరోనా దరి చేరకుండా పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం పారిశు ధ్య పనులు నిర్వహించడంతో పాటు వారానికి రెండుసార్లు బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నం. ఇతరులు గ్రామానికి వస్తే జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతు న్నాం. ఎవరికైనా ఆరోగ్య పరంగా ఇబ్బంది వస్తే వెంటనే పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించినం.
ఎవరూ బయటకు వెళ్లడం లేదు..
కరోనా రాక ముందు మా గ్రామం నుంచి మంచిర్యాలకు కూలీ పనులకు వెళ్లేవారు. సర్కారు లాక్డౌన్ అమలుచేశాక ఎవరూ బయటకు పోవడం లేదు. ఇక్కడే ఉపాధి హామీ పనులకు పోతున్నాం. కరోనాపై ప్రజలందరూ అవగాహన పెంచుకున్నారు. ఇతరులు ఇంటికి వస్తే దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. బయటకు వెళ్తే మాస్కు పెట్టుకుంటున్నారు.
-కోవ రాజు,గ్రామస్తుడు