మంచిర్యాల, అక్టోబర్ 22, నమస్తే తెలంగాణ :జిల్లా ప్రజలకు అత్యాధునిక మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు బల్దియాకు ఒకటి చొప్పున.. ఏడు చోట్ల ఇంటిగ్రేటెడ్ (సమీకృత) మార్కెట్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే బెల్లంపల్లిలో పనులు సాగుతుండగా, మిగతా చోట్ల స్థలాల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇవి అందుబాటులోకి వస్తే వెజ్, నాన్ వెజ్, కూరగాయలు, పండ్లు, తదితర వస్తువులన్నీ ఒకేచోట లభించనున్నాయి.
జిల్లా ప్రజలకు మరింత మెరుగైన మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ము న్సిపాలిటీకి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. వెజ్, నాన్ వెజ్, కూరగాయలు, పం డ్లు, తదితర వ్యాపారాలన్నీ ఒకేచోట నిర్వహించనుండగా, రైతులు, వ్యాపారులతో పాటు వినియోగదారులకూ మేలు చేకూరనున్నది. ఇప్పటికే బెల్లంపల్లి మున్సిపాలిటీలో భవన నిర్మాణం చురుగ్గా సాగుతుండగా, మిగతా చోట్ల వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
త్వరలోనే భవన నిర్మాణాలు ప్రారంభం..
మంచిర్యాల జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లకు ప్రతిపాదనలు చేశారు. బెల్లంపల్లిలో 56,362 జ నాభా ఉంది. స్థానిక పాత మార్కెట్ ప్రాంతం లో గల కాంటా చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. టీఐఎఫ్ఐడీసీ రూ.2 కోట్లు, 14వ ఆర్థిక సం ఘం (ఎఫ్సీ) రూ. కోటి కలిపి రూ. 3 కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కొన్ని మున్సిపాలిటీల్లో స్థలాల కేటాయింపు పూర్తి కాగా, మిగతా చోట్ల చివరి దశలో ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే భవన నిర్మాణాలు ప్రారంభించేలా సిద్ధమయ్యారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు జనాభా ప్రాతిపదికన ఆయా ము న్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తున్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రూ.3.7 కోట్లు, మంచిర్యా ల, నస్పూర్, మందమర్రి, చెన్నూర్, క్యా తనపల్లి, మందమర్రి మార్కెట్లకు రూ.7.2 కో ట్ల చొప్పున వెచ్చించి భవనాలు నిర్మించబోతున్నారు. బెల్లంపల్లి మినహా మిగితా ఆరు ము న్సిపాలిటీల్లో ఒకే నమూనాలో భవనాలు ని ర్మించనున్నారు. చెన్నూర్, మందమర్రి, క్యాతనపల్లి ఒక ప్యాకేజీ కింద, మంచిర్యాల, నస్పూ ర్, లక్షెట్టిపేట మరో ప్యాకేజీ కింద కేటాయించి టెండర్ల ప్రక్రియ కొనసాగించారు. స్థ లాల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తి కాగా, ప్రభు త్వ ఉత్తర్వులు రాగానే భవనాల నిర్మా ణం ప్రారంభించనున్నారు. రెండు ఎకరాల్లో భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచేలా సం బంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మార్కెట్లన్నీ ఒకే చోట..
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీ కేంద్రాల్లో కూరగాయలు, మాంసం అమ్మకాలు అధికంగా రోడ్లపైనే సాగుతున్నాయి. మార్కెట్లు ఉన్నా తక్కువ స్థలం ఉండడంతో రోడ్లపైనే వ్యాపారాలు సాగిస్తుండడంతో అనునిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటితో పాటు రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లో నూ పండ్లు, పూల వ్యాపారులు రోడ్లపైనే అ మ్మకాలు సాగిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మం త్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లపై దృష్టి సారించారు. వెజ్, నాన్ వెజ్, కూరగాయలు, పండ్లు, తదితర వ్యాపారాలన్నీ ఒకే చోట నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా నాన్ వెజ్ మార్కెట్లో అపరిశుభ్ర వాతావరణం లేకుండా పూర్తిస్థాయిలో నీటి సదుపాయాన్ని కల్పించడంతో పా టు నా ణ్యమైన మాంసం అమ్మకాలు సాగేలా చర్యలు చేపట్టనున్నారు. మున్సిపాలిటీ కేంద్రా ల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో టెం డర్ల ప్రక్రియ పూర్తి కాగా, ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సకల సౌకర్యాల తో మార్కెట్లన్నీ ఒకేచోట నిర్మించనుండడంతో ప్రజలు, రైతులు, కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.