వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం
జన్నారం, భీమారం మండల సమాఖ్యల ఆధ్వర్యంలోకస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు
మార్కెట్ కంటే తక్కువగా కిరాయి
మంచిర్యాల, నవంబర్ 21, నమస్తే తెలంగాణ : ఆధునిక వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు, ఆ మేరకు చిన్న, సన్నకారు రైతులకు యంత్రాలు, పరికరాలు అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే జన్నారం, భీమారం మండలాల సమాఖ్యల ఆధ్వర్యంలో సీహెచ్సీలను ఏర్పాటు చేయగా, ట్రాక్టర్, ట్రాలీ, కల్టివేటర్, హెవీ రోటవేటర్, నాగలి, కాటన్ శెడ్రర్, బ్రష్ కట్టర్, టార్పాలిన్లవంటివి బయటికంటే తక్కువ కిరాయికే దొరుకుతున్నాయి. సర్కారు సాయంతో ఇటు మహిళా సమాఖ్య సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకుంటుండగా, అటు రైతులకూ పెట్టుబడి ఖర్చులు తగ్గి ప్రయోజనం చేకూరుతున్నది.
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యంగా మా రింది. ఈ క్ర మంలో చిన్న, సన్న కారు రైతులకు వ్యవసాయ యం త్ర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు జన్నారం, భీమారం మండలాల సమాఖ్య కృషి చేస్తున్నది. అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు యంత్ర పరికరాలను మార్కెట్ కంటే తక్కువ ధరలకే అద్దెకు ఇస్తున్నది. ప్రభుత్వ ప్రో త్సాహంతో యంత్ర పరికరాలను సమకూర్చుకొ ని మహిళా సమాఖ్య సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
భీమారం మండల పరిధిలో..
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4, 2011న ఘ నంగా చేపట్టిన రైతు సంక్షేమ పథకాలలో భా గంగా జిల్లాలో మొదట మోడల్గా భీమారం సీహెచ్సీని ఏర్పాటు చేశారు. భీమారంలో రూ. 16,37,630లతో ఎన్ఆర్ఎల్ఎం నిధు ల ద్వారా రైతు ఉత్పత్తిదారుల వినియోగవస్తువుల అద్దె కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మండల సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ పనిముట్లు కొనుగోలు చేశారు. కస్టమ్ హై రింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని జిల్లాలోనే మోడల్గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నా రు. గతేడాది నుంచి రైతులకు బయట రేటు కంటే తక్కువతో పనిముట్లను అద్దెకు ఇస్తున్నారు. ఇందులో భాగంగా గో దావరి ఎఫ్పీ వో, రాష్ట్ర, కేంద్ర సభ్యత్వాల సహకారంతో భీమారం రైతు ఉత్పత్తి వినియోగ వస్తువుల అద్దె కేంద్రం ఏర్పాటు చేశారు. గతేడాది మూ డు నెలల వ్యవధిలో 89 మంది మహిళా రైతు కుటుంబాలకు సంబంధించిన భూముల్లో భీమారం సీహెచ్సీ నుంచి పనిముట్లు అందించారు. బయటి కన్నా తక్కువతో సేవలు అం దించారు. ట్రాక్టర్, ట్రాలీ, కల్టివేటర్, హెవీ రోటవేటర్, నాగలి, ప్లౌవ్ 2 పవర్ వీడర్స్, పత్తి చేనులో కలుపు తీసే యంత్రం (పవర్ స్ప్రేయర్), మాంగో స్ప్రేయర్, పత్తి చేను కత్తిరించే యంత్రం (కాటన్ శెడ్రర్), గడ్డి కోసే యంత్రం, కలుపు తీసే యంత్రం, చేతి పం పు, భూమిలో రంధ్రాలు చేసే యంత్రం, బ్రష్ కట్టర్, టార్పాలిన్లు మొదలైన పరికరాలను అ ద్దెకు ఇస్తున్నారు. గోదావరి సీహెచ్సీ భీమా రం ద్వారా ఇతరుల కన్నా తక్కువ ధరకు కిరాయికి ఇస్తూ రైతులకు సేవలందిస్తున్నారు. మ హిళా రైతులను దృష్టిలో పెట్టుకొని లాభాపేక్ష కాకుండా, సేవా దృక్పథంతో ఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షురాలు చింతల శైలజ తెలిపారు.. భీమారం మండలంలో 57 మహిళా రైతు సంఘాలు ఉన్నా యి. ప్రతి వస్తువును సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల అద్దె కేంద్రాన్ని జిల్లాలోనే మోడల్గా మార్చేందుకు అందరూ సహకరించాలని, పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం త్ర యంబకేశ్వర్ కోరుతున్నారు. భీమారంలోని మహిళా, ఇతర రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీహెచ్సీ మేనేజర్ నక్క రాజన్న, తదితరులు విజ్ఞప్తి చేశారు.
జన్నారం మండల పరిధిలో..
మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం పరిధిలోని వసుంధర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ను ఏర్పాటు చేశారు. సుమారుగా రూ.16 లక్షల నిధులతో ఒక ట్రాక్టర్, బ్లేడ్, ట్రాలీ, నాగలి, కల్టివేటర్, డ్రిల్ మిషన్, పురుగుల మందు పిచికారీ చేసే పంపు, చెట్లు కోసే రం పం తదితర రైతులకు ఉపయోగ పడే పరికరాలు కొనుగోలు చేశారు. రైతుల అవసరాల కు అనుగుణంగా మార్కెట్ ధర కంటే తక్కు కే అద్దెకిస్తున్నారు. ఈ యేడాది నుంచి సమా ఖ్య ఆధ్వర్యంలో అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. ఈ కేంద్రం నిర్వహణకు మేనేజర్, డ్రైవర్ను తాత్కాలికంగా నియమించుకున్నారు. వీ రి వేతనాలు, యంత్రాల నిర్వహణ వ్య యా న్ని అద్దె నుంచి చెల్లిస్తారు. సొంత భవ నం, అదనపు యంత్రాలను సమకూర్చుకుం టే చిన్న, సన్నకారు రైతులకు మరింత అండగా ఉంటుంది. యంత్రాల అద్దెకు డిమాండ్ ఎ క్కువగా ఉంటే మరిన్ని యంత్రాలు కొనుగో లు చేసే యోచనలో ఉన్నారు. రూ.వేల ఖర్చు చేసి యంత్రాలు కొనలేని చిన్న, సన్నకారు రైతులకు సీహెచ్సీలో లభించే అద్దె యంత్రా లు వారికి ఉపయోగకరంగా ఉంటున్నాయి.