హైదరాబాద్, జూలై 13: తెలుగు రాష్ర్టాల్లో జియో దూసుకుపోతున్నది. ఈ ఏప్రిల్లో 1.28 లక్షలకుపైగా కొత్త వినియోగదారులను అందుకున్నట్లు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించింది. ఏప్రిల్లో ఏపీ టెలికం సర్కిల్లో కొత్త కస్టమర్లను పొందిన ఆపరేటర్ జియో మాత్రమేనన్నది. మిగతా మూడు సంస్థలు సబ్స్ర్కైబర్లను తగ్గించుకున్నాయన్న ట్రాయ్.. తెలంగాణ, ఏపీల్లో జియో మొబైల్ యూజర్లు 3.21 కోట్లపైనేనని స్పష్టం చేసింది.