మిర్యాలగూడ,జూలై7: పల్లె, పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చడంతో పాటు విరివిగా మొక్కలు నాటుతున్నారు. గురువారం పూలు, పండ్ల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశారు. మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ల వెంట ఉన్న కంపచెట్లను తొలగించారు. ఇంటింటికీ పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. అడవిదేవులపల్లి మండలంలో ప్రత్యేకాధికారి నరేందర్ పలు గ్రామాలను సందర్శించి మొక్కలు పంపిణీ చేశారు. వేములపల్లి మండల ప్రత్యేకాధికారి మక్బూల్ అహ్మద్ డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలను పరిశీలించారు. మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేకాధికారి నాగేశ్వర్రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీనాయక్, ఎంపీడీఓలు మసూద్ షరీఫ్, జితేందర్రెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వర్లు, సర్పంచులు యాదమ్మ, వీరారెడ్డి, లలిత, అశోక్రెడ్డి, సైదులు, వెంకట్రెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.
పరిశుభ్రంగా మారిన గ్రామాలు
హాలియా : నాగార్జున సాగర్, హాలియా మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిలో భాగంగా రోడ్ల వెంట ఉన్న కంపచెట్లను తొలగించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్లు వెంపటి పార్వతమ్మా శంకయ్య, కర్ణ అనూషారెడ్డి, కౌన్సిలర్లు రమేశ్జీ, నాగశిరీష, మంగ్త, వీర్ల రామకృష్ణ పాల్గొన్నారు. అనుముల మండలంలోని పులిమామిడి, శ్రీనాథపురం, పాలెం, చింతగూడెం గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ కోసం రోడ్డు వెంట చెత్త తొలగించి గుంతలు తవ్వారు. ఎంపీడీఓ గోళ్ల లక్ష్మి, ఎంపీఓ భిక్షంరాజు పనులను పర్యవేక్షించారు. గుర్రంపోడు మండలం చామలేడుబావి, వట్టికోడు గ్రామాల్లో మొక్కలు నాటారు. నిడమనూరు మండల కేంద్రంతో పాటు ముకుందాపురం, బొక్కమంతలపాడు గ్రామాల్లో ఎంపీడీఓ ప్రమోద్కుమార్, ఎంపీఓ పల్లెబోయిన రామలింగయ్య ఆధ్వర్యంలో రోడ్ల వెంట మొక్కలు నాటారు. త్రిపురారం మండలం మర్రిగూడెం, నీలాయగూడెం, మాటూరు, కంపాసాగర్ గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు సుమతీ పురుషోత్తం, అనుముల పాండమ్మ, ఎంపీడీఓ సుధాకర్, ప్రమోద్ కుమార్, అలివేలు మంగమ్మ, ఎంఈఓ తరి రాము పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో అభివృద్ధి
దేవరకొండ : పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 16వ వార్డులో కంపచెట్లను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని చింతపల్లి మండల కేంద్రంలో మండల ప్రత్యేకాధికారి సంగీతలక్ష్మి, జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి మొక్కలు నాటారు. మండలంలోని గొడకొండ్ల, తీదేడు, కుర్మేడు గ్రామాల్లో మొక్కలు నాటడంతో పాటు పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు వీధుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని దుగ్యాల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి పరిశీలించి మొక్కలు నాటారు. డిండి మండలంలోని బొగ్గులదోన గ్రామంలో పల్లె ప్రగతి పననులను డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి పరిశీలించారు. కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి రాజేందర్, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ మోహన్రెడ్డి, గిరిబాబు సర్పంచులు జయమ్మ, కాయితి జితేందర్రెడ్డి, కొండూరు శ్రీదేవీ శ్రీనివాస్, భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి పాల్గొన్నారు.