రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
మానుకోటలో రూ.4.5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్కు శంకుస్థాపన
29వ వార్డులో పారిశుధ్య పనుల పరిశీలన
ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి 45 మంది వైద్యులు, ఏఎన్ఎంలకు సన్మానం
మహబూబాబాద్, జూలై 1 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళితక్రాంతి పథకానికి రూపకల్పన చేసిందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో రూ.4.5కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. 29వ వార్డు దళిత వాడలో కౌన్సిలర్ సోమయ్య ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి పనులపై ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ అధ్యక్షతన జరిగిన డాక్టర్స్ డే కార్యక్రమంలో పాల్గొని 45 మంది వైద్యులు, ఏఎన్ఎంలను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్నాయక్-సీతామహాలక్ష్మి దంపతుల పెళ్లిరోజు పురస్కరించుకుని మంత్రి వారికి స్వీట్లు తినిపించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితక్రాంతి పథకానికి రూపకల్పన చేసిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి పనుల సభను దళిత వాడల్లోనే నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో 29వ వార్డులో సభ నిర్వహించినట్లు తెలిపా రు. దళితుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందు కు కృషి చేస్తామని చెప్పారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ.50కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంటి సమస్యను తెలుసుకునేందుకు వాడవాడలా పాదయాత్ర చేపడుతామన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లతో ‘దళిత్ ఎంపవర్మెంట్’ పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి కుటుంబానికి రూ. 10లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దళితుల కోసం పట్టణంలో 400 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించామన్నారు. 29వ వార్డులో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు మంత్రి నిధుల నుంచి రూ.5 లక్షలు, కలెక్టర్ నుంచి మరో రూ.5 లక్షలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. రహదారుల శుభ్రత అందరూ బాధ్యతగా గుర్తించాలని, ప్రతి షాపు ఎదుట రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.
కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలు కాపాడిన ప్రత్యక్ష దేవుళ్లు డాక్టర్లన్నారు. కరోనా బాధితులను సొంతవాళ్లు పట్టించుకోకున్నా వైద్యులు వారికి మనోధైర్యాన్ని కల్పించి చికిత్స అందించడం గొప్ప విషయమన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, ట్రైనీ ఐఏఎస్ అభిషేక్అగస్త్య, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కమిషనర్ నరేందర్రెడ్డి, తహసీల్దార్ రంజిత్, సీఐ వెంకటరత్నం, ఎస్సైలు రమాదేవి, నగేశ్, గాలిబ్, ఏఎంసీ వైస్ చైర్మన్ మురళి, కౌన్సిలర్లు గోపీరత్నం గంగాధర్, ఎడ్ల వేణు, బాలూనాయక్, చీకటి వెంకన్న, గద్దె రవి, గోగుల రాజు, చిట్యాల జనార్దన్, హర్షికారావీశ్,మార్నేని రఘు, కాంట్రాక్టర్ రాజు, ఏవో తిరుపతిరెడ్డి, నిమ్మల శ్రీను, యాస వెంకటర్రెడ్డి, జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, డాక్టర్ వెంకట్రాములు, ఆర్ఎంవో చింత రమేశ్, వైద్యులు చంద్రశేఖర్, రాజ్కుమార్, బాలూనాయక్, జగదీశ్వర్, వినీల్రెడ్డి, ప్రదీప్రెడ్డి, సత్యనారాయణ, సందీప్, సూర్యకుమారి, వైదేహి, వీరన్న, శ్రీనివాస్, కార్తీక్, అర్జున్నాయక్, కీర్తి పాల్గొన్నారు.