అమరావతి : ఇండియా స్మార్ట్ సిటీ కంటెస్ట్-2020లో తిరుపతి నగరానికి 5 పురస్కారాలు దక్కాయి. ఇందులో 3 విభాగాల్లో తిరుపతి నగరపాలిక పురస్కారాలు దక్కించుకుంది. పారిశుధ్యం, ఈ-హెల్త్ విభాగాల్లో ప్రథమస్థానం సాధించింది. అదేవిధంగా సిటీ అవార్డ్స్, ఆర్థిక విభాగాల్లో రెండోస్థానంలో నిలిచింది. నగర పర్యావరణ విభాగంలో తృతీయ స్థానం వరించింది. ఈ సందర్భంగా తిరుపతి నగర మేయర్ శిరీష మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరానికి రానన్ని అవార్డులు తిరుపతికి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.