మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈశాన్య మెక్సికోలో ఓ బస్సు బోల్తా పడటంతో 12 మంది మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సరిహద్దు నగరమైన రేనోసా నుంచి న్యువో లియోన్ రాష్ట్రంలోని మోటెర్రే కు వెళ్తున్నది. ఈ క్రమంలో తమౌలిపాస్ రాష్ట్రంలో అదుపుతప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలోనే తొమ్మిది మంది మృతి చెందగా, మరో ముగ్గురు దవాఖానలో చనిపోయారు.