మేడ్చల్ రూరల్, జూన్ 15 : సహకార సంఘాల చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో ఇది సాకారమైంది. మేడ్చల్ మండలం పూడూరు ఆదర్శ రైతు సహకార సంఘానికి ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరైంది. సీఎం కేసీఆర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకున్న మర్రి రాజశేఖర్రెడ్డి రైతాంగానికి బాసటగా నిలువాలని సంకల్పించి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్, మంత్రులు చామకూర మల్లారెడ్డి, నిరంజన్రెడ్డి సహకారంతో ప్రాసెసింగ్ యూనిట్ను ఎంఎస్ఎంఈ ద్వారా మంజూరు చేయించారు. యూనిట్ను నెలకొల్పడానికి రూ.4.70 కోట్లు మంజూరయ్యా యి. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను మంగళవారం రైతు వేదిక కార్యాలయంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మర్రి రాజశేఖర్రెడ్డిలు సర్పంచ్ బాబుయాదవ్కు అందజేశారు. ప్రాసెసింగ్ యూనిట్ మంజూరుకు చొరవ చూపిన రాజశేఖర్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
సహకార సంఘాల చరిత్రలో ఇది నూతన అధ్యాయమని మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల స్వయం ప్రతిపత్తితో నడిచే మొదటి ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ యూనిట్ ఇదే అని చెప్పారు. ఈ ప్రాజెక్టు అక్టోబరు నాటికి పూర్తవుతుందని, పూడూరు ఆదర్శ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తుందని తెలిపారు. దీంతో రైతులు తమ ఉత్తమ గ్రేడ్ కూరగాయలను అధిక ధరకు, సాధారణ గ్రేడ్ను వాణిజ్య ఉపయోగాలకు విక్రయించి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చన్నారు. పూడూ రు సహకార సంఘం చైర్మన్ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ రైతుకు లాభం చేసేందుకు సహకార సంఘానికి ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేయించిన మర్రి రాజశేఖర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.