సంగారెడ్డి : జిల్లా పరిధిలోని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సర్వే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాఠిల్, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, మండలి ప్రోటెం ఛైర్మన్ భూపల్రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజు శ్రీ జైపాల్రెడ్డి హాజరయ్యారు.