హైదరాబాద్ : ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు.. ఫిర్యాదులు సమర్పించేందుకు వాట్సాప్, ఈ మెయిల్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు ఏమైనా సమస్యలుంటే ascmro@telangana.gov.in మెయిల్ లేదంటే 9133089444 నంబర్కు వాట్సాప్ చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సోమేశ్కుమార్ సూచించారు. సమయభావం లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగ అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్ శుక్రవారం సమీక్ష నిర్వహించిన సీఎస్.. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.