దేవాలయాలకు పూర్వవైభవం
నిర్మల్లో 500 ఆలయాలకు మరమ్మతులు చేశాం..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
సారంగాపూర్, మే 23 : ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, మరమ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకొస్తున్న దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాంసింగ్ తండాలో రూ. 12లక్షలతో ఏర్పాటు చేసిన శ్రీ జగదాంబదేవి, రాంరావ్ మహరాజ్ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 500 ఆలయాలకు మరమ్మతులు చేశామని చెప్పారు.
ప్రభుత్వం ఆల యాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివా రం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాం సింగ్ తండాలో రూ. 12 లక్షల వ్యయంతో నూత నంగా నిర్మించిన శ్రీ జగదాంబ దేవి ఆలయాన్ని మంత్రి ప్రారంభించారు. రాంరావ్ మహారాజ్ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి హాజర య్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా అనేక ఆలయాలకు మర మ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకొచ్చామని తెలిపారు. యాద్రాద్రి దేవాలయాన్ని అన్ని హం గులతో సర్వాంగ సుందరంగా సీఎం కేసీఆర్ తీర్చి దిద్దారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో 500 దేవా లయాలకు మరమ్మతులు చేయించామని, అడెల్లి పోచమ్మ దేవాలయాన్ని రూ. 10 కోట్లతో అభివృ ద్ధి చేస్తున్నట్లు చెప్పారు. జగదాంబ ఆలయంలో ప్రహరీ నిర్మాణంతోపాటు తదితర పనులకు మరో రూ. 6 లక్షలు అదనంగా మంజూరు చేస్తు న్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ రవీందర్రెడ్డి, అడెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ల సం ఘం అధ్యక్షుడు మహిపాల్ మురళికృష్ణ, నాయ కులు రాంకిషన్రెడ్డి, హాది, దత్తురాం, మాయ రాం, నారాయణ నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
నిర్మల్ అర్బన్, మే 23 : బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివా రం పట్టణంలోని ఇందిరనగర్ కాలనీకి విశ్వాస్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వివాహ వేడుకలకు మంత్రి హాజరు..
పట్టణంలోని ద్యాగవాడ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఆరె రమేశ్ కుమార్తె వర్ష- నాగరాజ్ వివాహం ద్యాగవాడ మున్నూరు కాపు సం ఘం భవనంలో జరిగింది. ఈ వివాహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై నూతన వధూవ రులను ఆశీర్వదించారు. ఆయా చోట్ల మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మ న్ ఎర్రవో తు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకి షన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్య నారాయ ణ గౌడ్, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, నాయ కులు మురళీధర్ రెడ్డి, ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, అయన్నగారి రాజేం దర్, ఎస్పీ రాజు, లక్కాకుల నరహరి, నాలం శ్రీనివాస్, ఆరె నగేశ్, రామకృష్ణ, అన్వేశ్, నాయకులు కుర్మె రాజు తదితరులున్నారు.