ఎమ్మెల్యే జోగు రామన్న సూచన
విలేకరులకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా సౌకర్యం
ఘనంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్ రూరల్, మే 23 : కొవిడ్ నేపథ్యం లో ప్రజలను ఎప్పటికప్పుడు మీడియా అప్రమ త్తం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచిం చారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జన్మ దినం సందర్భంగా పట్టణంలోని క్యాంప్ కార్యాలయం లో ఆదివారం విలేకరులకు హెల్త్కిట్లతోపాటు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల ఆరోగ్య బీమా కల్పించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన కుమారుడి జన్మదినం సందర్భంగా పట్టణంతో పాటు సుమా రు ఏడు మండలాల్లో పని చేసే విలేకరులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇందుకు ఒక్కొక్కరికీ రూ.1800 ఖర్చు అవుతుందన్నారు. విలేకరుల కుటుంబాలను ఆదుకోవడానికి తామెప్పుడు సిద్ధ్దంగా ఉన్నామన్నారు. త్వరలోనే విలేకరులకు ఇండ్ల పట్టాలు ఇచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ మం చి చెడులు ధైర్యంగా రాసేది జర్నలిస్టులేనన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడు తూ పట్టణంలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. తన జన్మదినం సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరో నా బాధితుల కోసం మూడు ఆక్సిజన్ కాన్సంట్రేట్లను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. వివిధ పత్రిక సంఘాల నాయకులు బేత రమేశ్, రాజు, దత్తు, శ్రీనివాస్, విఠల్, జోషి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు భరత్, సంద నర్సింగ్, కొండ గణేశ్, దమ్మపాల్, శ్రీనివాస్, పందిరి భూమన్న, ప్రకాశ్, లక్ష్మణ్, ఇమ్రా న్, మావల నాయకులు నల్ల రాజేశ్వర్, మహేందర్, కిరణ్, సెవ్వ జగదీశ్, రమేశ్ పాల్గొన్నారు.