న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. దాదాపు 25 ఏండ్లుగా మైక్రోసాఫ్ట్ ద్వారా నెటిజన్లకు సేవలు అందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఇక మూగబోనున్నది. వచ్చే ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవల్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ వెబ్ బ్రౌజర్ను విండోస్ 95తో కంపెనీ విడుదల చేసింది.
‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 డెస్క్టాప్ అప్లికేషన్కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించాం. విండోస్ 10కి చెందిన కొన్ని వెర్షన్లలో 2022 జూన్ 15 నుంచి దీని సేవలు అందుబాటులో ఉండవు’ అని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్ మేనేజర్ సియాన్ లిండర్సే తెలిపారు.
‘విండోస్ 10లో ఇక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలనుమైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో చూస్తాం. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వేగవంతమైందే కాదు.. మరింత సురక్షితం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను మించిన వినూత్న బ్రౌజింగ్ అనుభూతిని అందిస్తుంద’ని సియాన్ చెప్పారు.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోడ్ ఉంటుంది. దీనిసాయంతో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆధారిత వెబ్సైట్స్, అప్లికేషన్లకు యాక్సెస్ అవ్వొచ్చని తెలిపారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఆకాశానికెత్తారు.. ఆపై పడదోశారు.. ఎందుకు?
వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్లు : ఎస్బీఐ
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు డిజిటల్ సేవలకు దూరం ఎందుకంటే..!
జంట సవాళ్లు.. బెంగాల్లో 16 జూట్ మిల్లుల మూసివేత!