తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటుచేయగా.. ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్జేయి 1996 లో సరిగ్గా ఇదే రోజున ప్రమాణం చేశారు. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్రధాని పదవికి వాజ్పేయి రాజీనామా చేశారు.
1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించడంతో అటల్ బిహారీ వాజ్పేయి తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రభుత్వం మెజారిటీని నిరూపించలేక 13 రోజుల్లో పడిపోయింది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా ఇంత తక్కువ కాలం పదవిలో లేరు.
1996 నుండి 1998 ల మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తర్వాత లోక్సభ రద్దై, 1998 లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి 303 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ అతిపెద్ద సంకీర్ణంగా అటల్జీ మళ్ళీ ప్రధాని అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు ఎన్నికల తర్వాత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నాయకుడిగా అటల్జీ రికార్డులకెక్కారు.
ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 13 నెలల కాలం కొనసాగింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి అటల్జీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17 న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ప్రధాని పదవికి వాజ్పేయి రాజీనామా చేశారు.
1924 డిసెంబర్ 25 న జన్మించిన అటల్జీ.. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1951 లో భారతీయ జనసంఘ్ ఏర్పాటులో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1952 లోక్సభ ఎన్నికల్లో లక్నో సీటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1957 లో లక్నో, మధుర, బల్రాంపూర్ నుంచి పోటీచేయగా.. ఒక్క బల్రాంపూర్ నుంచే విజయం సాధించారు. 3వ, 9వ లోక్సభ ఎన్నికలు తప్పించి..14 వ లోక్సభ ముగిసేవరకు ఎంపీగా ఉన్నారు.
2014: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం.. 336 సీట్లు సాధించిన ఎన్డీఏ
2013: క్లోన్ చేసిన మానవ పిండాల నుంచి మూల కణాలను మొదటిసారిగా తీయడంలో విజయం సాధించిన అమెరికన్ శాస్త్రవేత్తలు
2007: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన నికోలస్ సర్కోజీ
2006: ప్రొస్థెటిక్ కాళ్లను ఉపయోగించి ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తిగా నిలిచిన న్యూజిలాండ్కు చెందిన 47 ఏండ్ల మార్క్ ఇంగ్లిస్
1975: భారతదేశంలో 22 వ రాష్ట్రంగా సిక్కిం అవతరణ
1960: భారతదేశం-బ్రిటన్ మధ్య అంతర్జాతీయ టెలెక్స్ సేవ ప్రారంభం
1929 : ఆస్కార్ అవార్డు బహూకరణ ప్రారంభం
ఆఫ్ఘన్-తాలిబాన్ల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం
పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
స్పైస్జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
టీకాలు తీసుకున్నా.. మాస్క్లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
–తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..