ఎమ్మెల్యే నోముల భగత్కుమార్
నందికొండ, మే 9 : కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సూచించారు. నందికొండ హిల్కాలనీలోని కమలానెహ్రూ ఏరియా దవాఖానను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలా నెహ్రూ దవాఖానలో కరోనా బాధితులకు ప్రత్యేక వార్డు ఏర్పాటుతోపాటు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు, వారికి చికిత్స అందించేందుకు డాక్టర్లతోపాటు కావలసినంత ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. నియోజకవర్గంలోని దవాఖానలు, పీహెచ్సీల్లో నిత్యం కరోనా పరీక్షలు చేస్తున్నారని, కరోనా లక్షణాలు గుర్తించిన వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కమలా నెహ్రూ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులకు వారం రోజులైనా లక్షణాలు తగ్గకపోతే సీబీబీ, సీఆర్పీ పరీక్షలు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి జిల్లా దవాఖానకు రెఫర్ చేయాలని డాక్టర్లకు సూచించారు. కరోనా పూర్తిగా తగ్గిందని నిర్ధారించుకునేందుకు సీబీబీ, సీఆర్పీ, ఈడైమర్, టెరిఫిన్, ఎల్డీఎస్ లాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను వైద్యులు, పార్టీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్లు, మంగ్తా, ఇర్ల రామకృష్ణ, నిమ్మల ఇందిరాగౌడ్, సీఎంఓ భానుప్రసాద్, డాక్టర్లు అమృత్నాయక్, చక్రవర్తి, నాయకులు విక్రమ్, విష్ణుమూర్తి, మోహన్నాయక్, శాంతకుమారి, సైదులు, శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.