హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్, మరో నలుగురు గాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ మంద రవిబాబు.. నిజామాబాద్ నుంచి సాయిపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద ధాటికి కారు ముందుటైరు విరిగి దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో రవిబాబు, కారు డ్రైవర్ హర్బజ్ ఖాన్, మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
దేశంలో కొత్తగా 62 వేల కరోనా కేసులు
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
హార్ధిక్ పాండ్యా, నటాషా డ్యాన్స్ వీడియో వైరల్
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు