హైదరాబాద్: భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ అంకితా రైనా టెన్నిస్ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ స్ట్రయికర్స్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ ఏడాది చివర్లో ముంబై వేదికగా జరుగనున్న ఈ లీగ్ కోసం మంగళవారం వేలం నిర్వహించగా.. మహిళా ప్లేయర్లలో అత్యధికంగా రూ. 4.10 లక్షల మొత్తాన్ని అంకిత దక్కించుకుంది. ప్రముఖ నటి రకుల్ప్రీత్ సింగ్ సహయజమానిగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ స్ట్రయికర్స్ జట్టులో అంకితతో పాటు అర్జున్ ఖడే, విష్ణువర్ధన్ ఉన్నారు.