న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న లీటర్ పెట్రోల్ 18 పైసలు, డీజిల్పై 17 పైసలు తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా దేశరాజధానిలో పెట్రోల్పై 21 పైసలు, డీజిల్పై 20 పైసల చొప్పున తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.78, డీజిల్ రూ.81.10కి పడిపోయాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.88.20గా ఉన్నాయి. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10, కోల్కతాలో రూ.90.98, డీజిల్ రూ.83.98, బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21గా ఉంది.
హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. నగరంలో లీటర్ పెట్రోల్ రూ.94.61, డీజిల్ రూ.88.67గా ఉన్నాయి. కరీంనగర్లో పెట్రోల్ రూ.94.48, డీజిల్ రూ.88.55 కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నగరాలైన విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉండగా, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉంది.
గతేడాది మార్చి 16 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం తొలిసారిగా నిన్న (బుధవారం) తగ్గాయి. ఏడాది కాలంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్పై రూ.21.58, డీజిల్పై రూ.19.18 పెరిగాయి.