హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ మరో జాతీయ స్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ జరుగనుంది. ఇందులో దాదాపు 700 మంది సైక్లింగ్ ప్లేయర్లు పోటీకి దిగుతున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను రాష్ట్ర క్రీడా,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ కార్యనిర్వహక కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.