వావిలాలలో ముందుకుసాగని ప్రగతి’ పనులు
అసంపూర్తిగా శ్మశానవాటిక, డంపింగ్ యార్డు
నర్సరీలో కనిపించని మొక్కలు
పత్తాలేని పారిశుధ్య పనులు అలంకార ప్రాయంగా సెగ్రిగేషన్ షెడ్డు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
పాలకుర్తి రూరల్, మార్చి 17:నర్సరీలో మొక్కలు లేవు.. శ్మశానవాటికకు దారి లేదు.. పారిశుధ్య నిర్వహణపై పట్టింపులేదు.. కంపోస్ట్షెడ్డు నిర్మించినా వినియోగంలోకి రాలేదు.. పంచాయతీ భవనం స్లాబ్కే పరిమితమైంది.. పాలకుర్తి మండలంలోని వావిలాలలో పల్లె ప్రగతి తీరిది. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నిధులిస్తున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు పడకేస్తున్నాయి.
వావిలాల గ్రామంలో 4వేల జనాభా, 2,300మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్లుగానే ఈ గ్రామానికి నిధులు నెలనెలా నిధులు మంజూరు చేసింది. గ్రామ పంచాయతీ భవనానికి రూ.16 లక్షలు, వైకుంఠధామానికి రూ.12.50లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ.2 లక్షలు, నర్సరీకి రూ.2లక్షలు, సెగ్రిగేషన్ షెడ్డుకు రూ.2.50లక్షలు కేటాయించింది. అయితే పుష్కలంగా నిధులున్నా, అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనం ఆ గ్రామానికి శాపంగా మా రింది. శ్మశానవాటికను ఆసంపూర్తిగా నిర్మించి వదిలేయడంతో పి చ్చిమొక్కలు మొలిచాయి. నర్సరీలో మొక్కలు పెంచకపోవడంతో ఎండిపోయి కనిపిస్తోంది. బ్యాగ్ ఫిల్లింగ్లకే పరిమితమైంది. గ్రామ పంచాయతీ భవనానికి నిధులున్నా అధికారుల నిర్లక్ష్యంతో బిల్లులు చేయకపోవడంతో స్లాబ్ దగ్గరే ఆగిపోయింది. పారిశుధ్యం పనులు పడకేశాయి. ఊరంతా పిచ్చి మొక్కలతో నిండింది. మోరీల నిండా బురద నిండి కంపుకొడుతున్నది. ఇక ఇప్పటివరకు డంపింగ్ యార్డు ఊసేలేదు. సెగ్రిగేషన్ షెడ్డును అసంపూర్తిగా నిర్మించారు. తడి, పొడి చెత్తను పోయడమే మరిచారు. పల్లె ప్రగతి పనుల్లో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ నిఖిల హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని తేటతెల్లమవుతున్నది.
మొక్కలు పెంచుతం
శ్మశానవాటిక ఆవరణలో మొరం పోయించినం. చదును చేసి రోడ్డు కూడా వేయిస్తా. నర్సరీలో మొక్కలు పెంచుతం. రైతు వేదిక పనులు చివరి దశలో ఉన్నయ్. త్వరలోనే అన్ని పనులూ పూర్తయితయ్. అధికారులు పంచాయతీ భవనం బిల్లులు వచ్చేలా చూడాలి.
నెల రోజుల్లో పూర్తి చేస్తాం
అసంపూర్తిగా ఉన్న పల్లె ప్రగతి పనులను నెల రోజుల్లో పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటిస్తూ పనులు చేయిస్తున్నాం. శ్మశానవాటిక, రైతువేదిక త్వరలో పూర్తవుతాయి. శ్మశానవాటికకు రోడ్డు నిర్మిస్తాం. మొరం నెరిపి పని పూర్తి చేస్తాం. నర్సరీలో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటా.
-పీ వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి
వారంలో చేయకపోతే చర్యలు
పల్లె ప్రగతి పనులను వారంలో పూర్తి చేయాలి. లేకపోతే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లపై చర్యలు తీసుకుంటా. బిల్లులు పెండింగ్లో ఉంటే నిధులు ఇప్పిస్తా. కానీ పనుల్లో వేగం పెంచాలి. కొన్ని పనులే అసంపూర్తిగా ఉన్నాయి. నేను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తా.