మస్కట్: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో 10 దేశాల నుంచి ఒమన్కు రాకపోకలపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఒమన్కు చెందిన సుప్రీం కమిటీ ఆ నిషేధాన్ని పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు నిషేధం కొనసాగుతుందని కమిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఒమన్ నిషేధం విధించిన పది దేశాల జాబితాలో సూడాన్, లెబనాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, ఘనా, గినియా, సియెర్రాలియోన్, ఇథియోపియా ఉన్నాయి. అయితే, సుల్తానేట్లోని విదేశీ మిషన్ల దౌత్యవేత్తలు, దేశంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులకు ఈ నిషేధ ఆంక్షల నుంచి సుప్రీం కమిటీ మినహాయింపునిచ్చింది.