హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఖతర్లో ఘనంగా నిర్వహించారు. దోహాలో జరిగిన జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ కేక్ కట్చేసి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 14న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. విద్యావంతులైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభీ వాణీదేవిలకు కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి పట్టంకట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, శంకరాచారి బొప్పరపు, అరుణ్ అలిశెట్టి, రాజేష్ నేత, కింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు.