కాట్మాండు : నేపాల్ ఆర్మీ చీఫ్ పూర్ణ చంద్ర థాప ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. నేపాల్లో రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆర్మీ చీఫ్ తన తొలి డోసులో మేడిన్ ఇండియా వ్యాక్సిన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నేపాల్కు భారత్ ఉచితంగా మిలియన్ కోవిడ్ టీకాలను అందజేసింది. సీరం సంస్థ తయారు చేస్తున్న కోవీషీల్డ్ టీకాలు ఇటీవల నేపాల్కు అందాయి. ఆ తర్వాతే నేపాల్లో జనవరి 27వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. పది లక్షల కోవీషీల్డ్ డోసులను నేపాల్కు ఉచితంగా భారత్ అందజేసింది. ప్రాధాన్యత ఆధారంగా తొలుత మెడికల్, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఆ టీకాలను ఇచ్చారు.నేపాల్లో సుమారు మూడు లక్షల మందికి కరోనా వైరస్ సంక్రమించగా.. రెండు వేల మంది కోవిడ్తో మరణించారు.