తొమ్మిది మంది ముఠా సభ్యుల అరెస్టు
వివరాలు వెల్లడించిన సీపీ చంద్రశేఖర్రెడ్డి
బెల్లంపల్లిరూరల్, నవంబర్ 19: మావోయిస్టుల పేరుతో ప్ర ముఖులను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మి ది మంది ముఠా సభ్యులను బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బెల్లంపల్లి రూరల్ పోలీస్ సర్కిల్ కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. వరంగల్ జిల్లా పరకాల మండలం నడికుడకు చెందిన తేలుకుంట్ల భిక్షపతి విప్లవ పాటలకు ఆకర్షితుడై 1991 నుంచి 1996 వరకు పీపుల్స్వార్ పార్టీలో దళ సభ్యుడిగా పని చేసి అప్పటి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడి కొంతమందితో ముఠా ఏ ర్పాటు చేసుకున్నాడు. తుపాకులు, మారణాయుధాలతో బెదిరింపులు, కిడ్నాపులకు పాల్పడుతున్నాడు. వరంగల్ జిల్లాలోని కాజీపేట, హన్మకొండ, మట్టేవాడ, పరకాల, ఎల్కతుర్తి, ఇంతేజార్గంజ్, కాకాతీయ యూనివర్సిటీ, కేశవపట్నం, కొత్తపల్లి, మానకొండూర్, ధర్మసాగర్, మడికొండ పోలీస్స్టేషన్లలో 13 కేసుల్లో నిందితుడిగా జైలుకు వెళ్లాడు. హన్మకొండ, వేములవా డ పోలీస్స్టేషన్లలో రెండు కిడ్నాప్,హత్య కేసుల్లోనూ నిందితు డు. కరీంనగర్,వరంగల్ జిల్లాలో భిక్షపతిపై పోలీసులు పీడీయాక్ట్ కూడా పెట్టారు. వరంగల్ సెంట్రల్ జైలులో మంచిర్యాలకు చెందిన అందుగుల శ్రీనివాస్తో పరిచయం ఏర్పడిందన్నారు. బయటకి వెళ్లాక మావోయిస్టుల పేరుతో డబ్బులు వ సూలు చేసేందుకు అందుగుల శ్రీనివాస్కు సలహాలు ఇవ్వడంతో పాటు అతని స్నేహితుడు క్రాంతిని కలవమని చెప్పాడు. ఇదేక్రమంలో జైలులో వరంగల్కు చెందిన వడ్లకొండ రాజ్కుమార్తో పరిచయం పెంచుకొని జైలునుంచి విడుదలయ్యాక అక్రమ వసూళ్లకు పథకం రచించారు.
2021లో భిక్షపతిని కరీంనగర్ పోలీసులు పీటీ వారెంట్పై కరీంనగర్ జైలుకు పం పించారు. అక్కడ దాసరి అంజయ్యతో పరిచయం ఏర్పడింది. దాసరి అంజయ్యను ములాఖత్లో కలిసేందుకు వచ్చే అతని స్నేహితుడైన దాసరి అంజిబాబు ఫోన్ నంబర్ , వివరాలను తెలుసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక ముందుగా అనుకున్న ప్రకారం వడ్లకొండ రాజ్కుమార్ను కలిసి మావోయిస్టుల పేరుతో బెదిరింపులు, కిడ్నాప్లకు దిగేందుకు సిద్ధమయ్యడు. దొంగతనం కేసులో వరంగల్ జైలులో పరిచయమైన మహ్మద్ అఫ్జల్, ఉత్తరప్రదేశ్కు చెందిన పునీత్భారతికి రూ. లక్ష ఫోన్పే నుంచి పంపించి బీహార్ నుంచి రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, 3 రౌండ్లు తెప్పించుకున్నారన్నారు. తమకు పరిచయమున్న ప్రదీప్కుమార్, రాజశేఖర్, మతీన్, ఇమ్రాన్, నానికు డబ్బుల ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని ముఠాగా ఏర్పడ్డా రు. వ్యాపారులను, ప్రముఖులను బెదిరించేందుకు ముఠాలో అందరి వద్ద తుపాకులు ఉండాలని భావించి రాజ్కుమార్, భిక్షపతి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని దుకాణంలో డమ్మీ పిస్టల్, డమ్మీ రివాల్వర్ కొనుగోలు చేశారు. నాని వద్ద కూడా రెండు డమ్మీ పిస్టల్స్ను ముఠాలోని వ్యక్తులకు ఇచ్చాడు. తమపై ఎవరైనా ప్రతిఘటిస్తే దాడి చేసేందుకు రెండు కత్తులు, రెండు తల్వార్లు సమకూర్చుకున్నారు. రెండు వాకీ టాకీలను హైదరాబాద్లోని కోటిలో రూ.3 వేలకు కొనుగోలు చేశారు.
రాజ్కుమార్, భిక్షపతి ముందుగా అనుకున్న ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన దాసరి అంజిబాబును కిడ్నాప్చేసి డబ్బులు వసూళ్లు చేద్దామని సెప్టెంబర్లో పథకం పన్ని బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి శివారులో ముఠా సభ్యులతో కలిసి కారులో కిడ్నాప్ చేసి మందమర్రి వైపునకు తీసుకెళ్లి పిస్టళ్లు చూపించి తాము మా వోయిస్టు నాయకుడు గణేశ్ దళ సభ్యులమని చెప్పి రూ 30 లక్షలు డిమాండ్ చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు అంజిబాబు భయపడి వీరికి రూ.2 లక్ష లు ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో బాధితుడు దాసరి అంజిబాబు ఈ నెల 16 న తాళ్లగురిజాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం బెల్లంపల్లి టీజంక్షన్ వద్ద పోలీసులు నిఘా పెట్టి మావోయిస్టుల పేరుతో కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడుతున్న భిక్షపతిని అదుపులోకి తీసుకుని ముఠా సభ్యులైన వడ్లకొండ రాజ్కుమార్ (రామంతాపూర్,హైదరాబాద్), మహ్మద్ మతీన్ (యూసఫ్గూడ, హైదరాబాద్), మోటమర్రి ప్రదీప్కుమార్ (బోరబండ, హైదరాబాద్), రాగుల రాజశేఖర్( స్టేషన్ ఘన్పూర్, వరంగల్), తుంగ క్రాంతి కుమార్ (తిమ్మాపూర్, మందమర్రి), పునీత్భారతి (ఎల్బీనగర్, వరంగల్), మహ్మద్ ఇమ్రాన్ఖాన్ (రామ్నగర్, హైదరాబాద్), మహ్మద్ అఫ్జల్ (దేశాయిపేట ,వరంగల్), రాగుల తిరుపతి అలియాస్ నాని , అందుగుల శ్రీనివాస్ ( బీ-జోన్,రామకృష్ణాపూర్)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు నకిలీ బంగారు దేవతా విగ్రహాన్ని అసలైన బంగారు దేవత విగ్రహంగా నమ్మబలికి చాలా మంది దగ్గర డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు సీపీ చెప్పారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి కారు, స్కూటీ, రెండు తల్వార్లు, రెండు వాకీటాకీలు, చార్జర్లు, 50 మావోయిస్టుల లెటర్ప్యాడ్స్ పేపర్లు, 7 సెల్ఫోన్లు, 2 పాకెట్ నోట్బుక్స్, 2 కంట్రీమేడ్ పిస్ట ల్స్, 2 డమ్మీ పిస్టల్స్,1 డమ్మీ రివాల్వర్, 1 ఎయిర్ పిస్టల్, ఒక 7.65 ఖాళీ రౌండ్ కేస్, ఒక 7.65 లైవ్ రౌండ్స్, నకిలీ బంగారు దేవత విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.