మెడికల్, టెస్టింగ్ కిట్లు, ఆక్సీమీటర్లు అందజేత
కలెక్టర్ భారతీ హోళికేరికి అందజేసిన దివాకర్రావు
మంచిర్యాలటౌన్, మే 19 : కొవిడ్ బాధితులకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అండగా నిలుస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమో దు కావడం, వైద్యం కోసం బాధితులు ఇబ్బందులు పడుతుండడం గమనించిన ఆయన పెద్ద ఎత్తున మందులు, అవసరమైన సామగ్రిని అం దుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ మే రకు దాతల సహకారాన్ని కోరగా పలువురు స్పందించారు. వారు అందించిన రూ. 12.85 లక్షలతో సామగ్రిని కొనుగోలు చేసి కలెక్టర్ భా రతీ హోళికేరికి కలెక్టరేట్లో బుధవారం అందజేశారు. ఇందులో 3500 మెడికల్ కిట్లు, 700 ఆక్సీ మీటర్లు, 2500 టెస్టింగ్ కిట్లు ఉన్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి మందులు, కిట్లు అం దించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
లాక్డౌన్ విధించండం రాష్ట్ర ప్రభుత్వానికి భారమే అయినప్పటికీ ప్రజల ప్రాణా లు కాపాడడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. అత్యవసర పనులుంటేనే ప్రజలు బయటకు రావాలని, ఏమైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకుని ఐసొలేషన్ లో ఉండాలని కోరారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, తరచూ చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో మంచిర్యాల, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, నల్మాసు కాంతయ్య, మార్కెట్ కమి టీ చైర్మన్ పల్లె భూమేశ్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు గోగుల రవీందర్రెడ్డి పాల్గొన్నారు.