ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
నౌగాంబస్తీ దవాఖాన పరిశీలన
కాగజ్నగర్టౌన్ , మే 19 : కొవిడ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నా రు. పట్టణంలోని యూపీఎస్హెచ్సీ నౌగాంబస్తీ దవాఖానను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికే ఇంటింటా జ్వర సర్వే చేపట్టామని, ప్రజలు సహకరించాలన్నారు. లక్షణాలు ఉన్నవారికి కరోనా కిట్లు అందజేస్తున్నామని ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఇబ్బందిగా ఉన్నవారు మాత్రమే సెంటర్కు రావాలని కోరారు. లక్షణాలు ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఇంటింటా సర్వేను పరిశీలించి కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఎలాంటి మందులు ఇస్తున్నా రు..? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో అం దించిన ఆక్సిజన్ సిలిండర్లను జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్డీవో చిత్రు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వైద్యాధికారులు, వైద్య, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు : అదనపు కలెక్టర్ రాజేశం
చింతలమానేపల్లి , మే 19 : విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ రాజేశం హెచ్చరించారు. మండలంలోని రవీంద్రనగర్-1లోని బాబాపూర్, గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించగా, సరిగా లేకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. ఇంటింటా జ్వర సర్వేను కూడా సరిగా నిర్వహించలేదని, కొవిడ్ లక్షణాలు 329 మందికి కిట్లు ఇచ్చి వదిలేశారని, రెండురోజులకు ఒకసారి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోకుం డా ఉండడంపై మండల అధికారులు, వైద్య సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ర వీంద్రనగర్లో-1 లో ఇంటింటా తిరుగుతూ జ్వర సర్వే సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రపుల్లమాజీ (70) అనే వ్యక్తి ఈనెల 5న కొవిడ్ పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయనకు కరోనా కిట్ను అందజేసి తర్వాత పట్టించుకోలేదని, దీంతో పరిస్థితి విషమించడంతో కాగజ్నగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా రూ. 2 లక్షల వరకు ఖర్చు అయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అంగన్వాడీ సూపర్వైజర్ ఇందిరాగాంధీ, ఏఎన్ఎం పార్వతీ, కార్యదర్శి విజయ్పై మండిపడ్డారు. నిర్లక్ష్యం తగదని, తహసీల్దార్ బికర్ణదాస్, ఎంపీడీవో కుటుంబ రావు సర్వేను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని లేకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే లంబాడీహెట్టి అంగన్వాడీ ఆయా కమల కరోనాతో ఆదివారం రాత్రి మృతి చెందినా.. ఇప్పటి వరకు రికార్డులో ఎందు కు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోప్రజలను అప్రమత్తం చేసి ఇంటింటా సర్వే పక్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.