గ్రామ దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యేలు దివాకర్రావు, కోనప్ప
బోనాలు సమర్పించిన భక్తులు
చెన్నూర్, జూలై 18: పట్టణంలోని మదునపు పోచమ్మ ఆల యం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలో విందు భోజనాలు చేశారు. ఇదిలాఉంటే కొవిడ్ నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినొద్దీన్, కౌన్సిలర్ జోడు శంకర్, టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, నాయిని సతీశ్, మహేందర్ అవగాహన కల్పించారు.
పోచమ్మకు ఎమ్మెల్యే దివాకర్రావు పూజలు..
మంచిర్యాల ఏసీసీ, జూలై 18: పట్టణంలోని రెడ్డి కాలనీలో పో చమ్మ బోనాలకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరయ్యా రు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి పసుపు కుం కుమలతో పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు, పోచమ్మ ఆలయ నిర్వాహకులు బోడ ధర్మేందర్, బొమ్మ సత్తిరెడ్డి, విశ్వనాథ ఆలయ చైర్మన్ శ్రీనివాస్, విశ్వనాథ ఆలయ ధర్మకర్త రీనా రాణీదాస్, మాజీ కౌన్సిలర్ కారుకురి చంద్రమౌళి, జూపాక సుధీర్, నెల్లి ప్రభాకర్, గదార్ల సతీశ్, మనోహర్ రెడ్డి, కొత్త జయప్రకాశ్, సురేందర్, కృష్ణ, రాజబాబు, మండల శ్రీనివాస్ పాల్గొన్నారు.
నల్లపోచమ్మకు ఎమ్మెల్యే కోనప్ప ..
కాగజ్నగర్ రూరల్, జూలై 18: పట్టణంలోని ఈఎస్ఐ దవాఖాన సమీపంలోని నల్లపోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కోన ప్ప, జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు యెల్లేశ్, బంక శివ, శివప్రసాద్, జైచందర్, సునీల్, నాయకులు సంజయ్ సింగ్, బొబ్బిలి అశో క్, తుమ్మ రమేశ్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
గూడెంలో ఊరుకట్టడి..
దండేపల్లి, జూలై18: మండలంలోని గూడెం గ్రామంలో ఊరుకట్టడి సందర్భంగా ఆదివారం గ్రామదేవతలకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేశా రు. పూజారి ఊరి చుట్టూ తిరుగుతూ బంధనం చేశారు.