మంచిర్యాల అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి
కిష్టంపేట నర్సరీ పరిశీలన
చెన్నూర్ రూరల్, జూన్ 18 : హరితహారాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని కిష్టంపేట నర్సరీని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల చివరి వా రం లో హారితహారం చేపడుతామని, ప్రణాళికలు సి ద్ధం చేయాలని ఎంపీడీవో మల్లేశంకు సూచించా రు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని, ప్రజలు శుభ్రత పా టించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి కరో నా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చే యాలని సూచించారు. ఈజీఎస్ ఏపీ వో గంగాభవానీ, స ర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, ఉప సర్పంచ్ ముకుంద రెడ్డి, పంచాయతీ సెక్రటరీ దివాకర్ ఉన్నారు.
మొక్కలు సిద్ధం చేయాలి..
తాండూర్, జూన్ 18 : హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని డీపీవో నారాయణరావు అన్నా రు. మాదారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం పరిశీలించారు. ఎలంటి మొక్కలు పెంచుతున్నారని సర్పంచ్ సాగరిక, కార్యదర్శి సౌందర్యను అడిగి తెలుసుకున్నారు. రోడ్లకిరువైపులా, చేలు, పొలాల గట్లు, తదితర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. అనంతరం శ్మశాన వాటిక, డంప్ యార్డు, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆవరణ శుభ్రంగా ఉండడంతో ప్రశంసించారు. ఎంపీడీవో శశికళ, ఎంపీవో అక్తార్ మోయినొద్దీన్, ఉప సర్పంచ్ ఆసియా, తదితరులు ఉన్నారు.