ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మాండ్ల జగదీశ్
మండలకేంద్రంలో సెంటర్ ప్రారంభం
తిర్యాణి, మే18 : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మాండ్ల జగదీశ్ సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన వడ్లు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బుర్ర రాజ్యలక్ష్మి, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శంకర్గౌడ్, ఏఈవో ముత్తయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.
నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి..
ఆసిఫాబాద్టౌన్,మే18 : రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయాధికారి ఖాదర్ హుస్సేన్ అన్నారు. మండలంలోని కొమ్ముగూడ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1888, బీ గ్రేడ్కు రూ.1868 ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఏఈవో చిరంజీవి, పీఏసీఎస్ సీఈవో రమణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన,మే18: మండలంలోని నంబాల గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఏఈవో అర్చన మంగళవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన వడ్లు తీసుకొచ్చి సహకరించాలని ఆమె కోరారు. పీఏసీఎస్ సీఈవో సంతోష్ ఉన్నారు.