మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్ర సమితి అత్యంత బలమైన శక్తిగా అవతరించిందని, ప్రజలంతా పార్టీ వెంటే ఉన్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ఈ నెల రెండో తేదీ నుంచి నిర్వహించిన వార్డు, గ్రామ కమిటీల జాబితాను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి గూడూరి ప్రవీణ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలోని 66 గ్రామాలు, 74 వార్డులలో ఇప్పటికే కమిటీల నియామకం పూర్తయిందని వెల్లడించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ అరగుండు నేత, నోటి దురుసు నాయకులు వారి ఉనికి కోసం టీఆర్ఎస్పై నీచమైన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో మరింత చులకనగా తయారవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు, నాయకులు అత్తి సరోజ, గోగుల రవీందర్రెడ్డి, గాదెసత్యం, గొంగళ్ల శంకర్, తోట తిరుపతి, బొలిశెట్టి కిషన్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
కష్టపడి పని చేసే వారికి గుర్తింపు
తాండూర్, సెప్టెంబర్ 17 : పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్యకర్తలే పార్టీ రథసారథులని టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి గూడూరి ప్రవీణ్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాండూర్ మండల కేంద్రంలోని సురభి గార్డెన్స్లో శుక్రవారం ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రవీణ్, ఎమ్మెల్యే చిన్నయ్య పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామ స్థాయి కమిటీలను నియమించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ పనితీరును కొనియాడారు. మండల అధ్యక్షుడిగా మరో మారు రేచిని గ్రామానికి చెందిన సుబ్బ దత్తుమూర్తి మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా తాండూర్కు చెందిన రహమత్ను ఎన్నుకున్నారు. ఎన్నికైన మండల కమిటీని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సాలిగామ బానయ్య, బుగ్గ దేవస్థానం చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దత్తాత్రేయరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా టీఆర్ఎస్..
నెన్నెల,సెప్టెంబర్17: ప్రజలకు అండగా ఉండేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. నెన్నెల మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పథకాలను వివరించారు. కొందరు ఎమ్మెల్యేగా పోటీచేస్తే రెండు వేల ఓట్లు రాకున్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అలాంటి వారి విమర్శలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడిగా పంజాల సాగర్ గౌడ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజక వర్గ పరిశీలకులు ప్రవీణ్ , ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, పీఏసీఎస్ చైర్మన్ మల్లేశ్, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, రైతు బంధు సమితి అధ్యక్షుడు అశోక్గౌడ్, కో ఆప్షన్ ఇబ్రహీం, ఎంపీటీసీలు తిరుపతి, కమల, నాయకులు భీమాగౌడ్, ప్రతాప్రెడ్డి, మసూద్, మొండన్న తదితరులున్నారు. .