ఒక రోజు ముందే ముగ్గురుకార్డియాలజిస్ట్ల రాజీనామా
వైద్యులు భర్తీకి నోటిఫికేషన్ వేస్తాం..
రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్
ఎదులాపురం, జనవరి 17 : ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వారాల్లో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఓపీ, ఐపీ సేవలు ప్రారంభిస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఓపీ సేవలు సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ముగ్గురు కార్డియాలజిస్ట్లు ఒకరోజు ముందే రాజీనామా పత్రాలను రిమ్స్ డైరెక్టర్కు పంపించారు. యూరాలజిస్ట్కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రారంభం కావల్సిన ట్రయల్న్ సేవలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ పలు వివరాలు వెల్లడించారు. వైద్యులు ఎందుకు రాజీనామా చేశారో తెలియడం లేదన్నారు. ప్రస్తుతం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వచ్చే డాక్టర్ల కోసం అదనంగా నిధులివ్వడంతో పాటు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరో రెండు వారాల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో వైద్యుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ వేస్తామని తెలిపారు. ఓపీ, ఐపీ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, సూపర్ స్పెషాలిటీ సూపరింటెండెంట్ ఇద్రీస్ అక్బానీ, వైద్యులు తొడసం చందు, తిప్పస్వామి, కల్యాణ్రెడ్డి, దేవిదాస్ పాల్గొన్నారు.