రాష్ట్రంలో 2.90 కోట్ల రేషన్ కార్డులు జారీ
రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి
సీసీసీలో అధికారులతో సమీక్షా సమావేశం
సీసీసీ నస్పూర్, జూలై 16 : ఆహార భద్రత చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి పేర్కొన్నారు. సీసీసీ నస్పూర్ సింగరేణి అతిథి గృహంలో కలెక్టర్ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్తో కలిసి శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆకలిచావులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం అందజేయాలన్నారు. రాష్ట్రంలో దా దాపు 2 .90 కోట్ల రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు. అనంతరం కలెక్టర్ భారతీహోళీకేరి మాట్లాడుతూ ఈ యేడు పెద్ద ఎత్తున వరిధాన్యం కొనుగోలు చేశామన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైనా వారికి త్వరాగా కార్డులు అం దేలా చూస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు సత్యనారాయణ, నరేందర్, శేషాద్రి, ప్రేంకు