అధికారులు నిత్యం పర్యవేక్షించాలి
ప్రజలకు అవగాహన కల్పించాలి
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి
హాజీపూర్, జూలై 15 : అర్హులందరికీ రేషన్ అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. మండలంలోని గుడిపేట, నంనూర్ గ్రామాల్లోని రేషన్ దుకాణాలు, హాజీపూర్, దొనబండ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, వేంపల్లిలోని అంగన్వాడీ సెంటర్ను గురువారం తనిఖీ చేశారు. గుడిపేట, నం నూర్లో రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నా యా..? అని అడిగి తెలుసుకున్నారు. నంనూర్ రేషన్ షాపులోని బియ్యం బస్తాలో అంబార్ ప్యాకెట్ కవర్ రావడంతో క్వాలిటీ కంట్రోల్ టెక్నికల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దొనబండ, హాజీపూర్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి మధాహ్న భోజనం వివరాలను వంట మనిషిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత విషయంలో గ్రామం నుంచి రాష్ట్రస్థాయి కమిషన్ పరిశీలిస్తుందన్నారు. వీరి వెంట డీఆర్డీవో శేషాద్రి, డీఎస్వో ప్రేం కుమార్, డీఎం గోపాల్, ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో కందుకూరి రవిబాబు, తహసీల్దార్ వా సంతి, క్వాలిటీ కంట్రోల్ టెక్నికల్ అస్టిటెంట్ నర్సింహమూర్తి, ఎంఈవో, సర్పంచ్లు, లగిశెట్టి లక్ష్మి-రాజయ్య, పద్మ, జాడి సత్యం, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత – శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి – రవి, మండల రైతుబంధు సమితి కో-ఆర్టినేటర్ పూస్కూరి శ్రీనివాస్ రావు, మండల యువత అధ్యక్షుడు బాపు, డీటీ ఎన్ఫోర్స్మెంట్ విజయ, కొండయ్య పాల్గొన్నారు.