మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
పట్టణంలో జ్వర సర్వే పరిశీలన
మంచిర్యాలటౌన్, మే 14: కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. పట్టణంలోని రాంనగర్లో సిబ్బందితో కలిసి శుక్రవారం ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వైద్య సిబ్బందికి తెలియజేయాలని, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పైగా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్కు తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, వార్డు కౌన్సిలర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదెసత్యం, పెంట మల్ల య్య, అజయ్, అంగన్వాడీ టీచర్ రమ, ఆర్పీ సు జాత, ఏఎన్ఎం అంజలి, తదితరులు ఉన్నారు.
పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేత
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అందజేసిన పీపీఈ కిట్లను ఎమ్మెల్యే దివాకర్రావు మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మున్సిపల్ కార్మికులే చొరవ తీసుకొని పూర్తి చేస్తున్నారని, వారి సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. అలాగే కార్మికులకు పీపీఈ కిట్లు అందించిన రోటరీ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షుడు వొజ్జల నిరంజన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.