సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్
హరితహారం కార్యక్రమాలకు హాజరు
మందమర్రి రూరల్, జూలై 13 : మొక్కల సంరక్షణ అందరి బాధ్యతని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ అన్నారు. హరితహారంలో భాగంగా కేకే 2 ప్రాంతంలోని ఖాళీ ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన మంగళవారం 500 మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ యేడు సింగరేణి వ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మందమర్రి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి సాధనకు కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జీఎం చింతల శ్రీనివాస్, పీఎం వరప్రసాద్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం ప్రతినిధి రమేశ్, పారెస్టు అధికారి రమణారెడ్డి, పర్యావరణ అధికారి ప్రభాకర్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో పర్యటన
రెబ్బెన,జూలై 13 : బెల్లంపల్లి ఏరియాలోని కైర్గూడ ఓసీపీ, బీపీఏవోసీపీటిని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్ సందర్శించారు. అనంతరం గోలేటిలోని జీఎం కార్యాలయం సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. గోలేటి సీహెచ్పీ వద్ద మొక్కలు నాటి, నీరు పోశారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఏరియా జీఎం సంజీవరెడ్డి, ఎస్వోటూజీఎం సాయిబాబా, ఏజీఎం కమలాకర్భూషణ్, డీజీఎం(సిహెచ్పీ)భీంరావు జాడే, డీవైపీఎం తిరుపతి, సెక్యూరిటీ అధికారి వరప్రసాద్, ఎన్వీరాన్మెంట్ అధికారి హరీశ్, ఫా రెస్ట్ అధికారి నవీన్, పిట్ కార్యదర్శి మెరుగు రమేశ్ పాల్గొన్నారు.
కంటిన్యూయస్ మైనర్ యంత్రం పరిశీలన..
బెల్లంపల్లిటౌన్, జూలై 13 : మందమర్రి ఏరియా శాంతిఖని గని ఆవరణలోని కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ జీఎం చింతల శ్రీనివాస్తో కలిసి పరి శీలించారు. యంత్రం విడిభాగాలు బోల్టర్, ఫ్రీడర్ బ్రేడర్, షటి ల్ కారులను జీఎంఎస్ కంపెనీ మేనేజర్ శుక్లా సిబ్బందితో కలిసి చేస్తున్న మరమ్మతులను పరిశీలించారు. పనులు పూర్తయిన వెంటనే పరికరాలను జీడీకే 11 ఇైంక్లెన్కు తరలించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎం (ఈఅండ్ఎం) జగన్మోహన్రావు, గని మేనేజర్ శంకర్, ఇన్చార్జి శాంతిఖని ఏజెంట్ చిలుక శ్రీనివాస్, కేకే ఏజెంట్ రాంచందర్, డీజీఎం సర్వే జైనులాబ్దిన్, గ్రూప్ ఇంజినీర్ కృష్ణమూర్తి, పిట్ ఇంజినీర్ రాంప్రసాద్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ రాంబాబులు పాల్గొన్నారు.