గ్రామాల్లో విజయవంతంగా పారిశుధ్యం,హరితహారం కార్యక్రమాలు
అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
దండేపల్లి, జూలై11 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవం తమైంది. ఈ నెల 1న ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమం 10 వరకు కొనసాగింది. దండేపల్లి మండలంలోని 31 గ్రామపంచాయతీల్లో వందూర్గూడ పంచాయతీ మినహా అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు చురుగ్గా సాగా యి. దండేపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్లు, ప్రత్యేకాధికారులు, జీపీ కార్యదర్శులు కో ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పల్లెలో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడంతో గ్రామాలన్నీ మెరిసిపోతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు. దీంతో గ్రామాల్లో గతంలో ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కరిష్కారమయ్యాయి. ఈ నెల 4న మండలంలోని నర్సాపూర్లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి మొక్కలు నాటి, పల్లె ప్రగతిపై సూచనలు అందించారు. ఈ నెల 2న జిల్లా పంచాయతీ అధికారి నారాయణ్రావు మేదరిపేట, తాళ్లపేటలో పర్యటించారు. పరిశుభ్రత పాటించని దుకాణాదారులకు రూ.32 వేల జరిమానా విధించారు. పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు.
వైకుంఠధామాలు, డంప్యార్డులు, పార్కులపై ప్రత్యేక శ్రద్ధ
నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రకృతి వనాల్లో పిచ్చి మొక్కలను తొలగించి, సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించి డంప్ యార్డులకు తరలించి నిల్వ చేసి వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీపై అవగాహన కలిగించారు. మురుగు కాలువల్లో పూడిక తీసి, చెత్తా చెదారాన్ని తొలగించారు. తాగునీటి బావుల్లో క్లోరినేషన్ చేశారు. ప్రతి ఒక్కరికీ 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి, వాటిని నాటాలని సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణకు ర్యాలీ తీశారు. పల్లె ప్రగతి చివరి రోజైన శనివారం స్థానిక జీపీలలో జరిగి గ్రామసభలలో నివేదికలను తయారుచేసి ముగింపు గ్రామసభల్లో వినిపించారు.
ఇవి కూడా చదవండి..