ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల బ్యానర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్ టౌన్,జూన్ 10 : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పీవీటీజీ ప్రతిభా కళాశాలల్లో మెరుగైన విద్య అందుతుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాం ప్ కార్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల బ్యానర్ను ప్రిన్సిపాల్ సురేశ్తో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీవీటీజీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పిన్సిపాల్ సురేశ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రతిభా కళాశాలలు ఉన్నాయని, ఇం టర్తో పాటు ఐఐటీ, నీట్, క్లాట్, సీఎంఏ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎలాంటి అడ్మిషన్ ఫీజు, ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ప్రిన్సిపాళ్లను ఫోన్ ద్వారా సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చన్నారు. టెన్త్ ఉత్తీర్ణులైన కొ లాం, తోటి, మన్నె, చెంచు తెగల విద్యార్థులు అడ్మిషన్ కోసం హయత్నగర్లో ఎంపీసీ, బైపీసీ (బాలురు) ప్రిన్సిపాల్ 738 2931511, బాలికలు, 8374161149, చెంగిచెర్లలో సీఈ సీ, హెచ్ఈసీ (బాలురు) 9490215948, బాలికలు 949 2577537 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ చారి, ధర్మయ్య, కుమార స్వామి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.