బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య
సన్మానం.. నిత్యావసరాల పంపిణీ
నెన్నెల ఆరోగ్య కేంద్రం పరిశీలన
కన్నెపల్లి, జూన్ 8 : ప్రస్తుత కరోనా కాలంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం అందిస్తున్న సేవలు అభినందనీయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. కన్నెపల్లిలోని రైతు వేదిక భవనంలో మంగళవారం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి గ్రామాల్లో సేవలందిస్తున్నారన్నారు. అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం కరో నా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నదన్నారు. అనంతరం మంజులకు మంజూరైన రూ.48 వేలు, శేఖర్కు మంజూరైన రూ.18వేల సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సత్యనారాయణ, ఎంపీటీసీలు భారతి, లతశ్రీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజన్న, యువజన సంఘం నాయకుడు జిల్లెల మహేశ్గౌ డ్, ఉప సర్పంచ్ గడ్డల వెంకటేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కర్ర శంకర్, నాయకులు ప్రమోద్గౌడ్, పుల్లూరి రాజయ్య, భీమాగౌడ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
నెన్నెల ఆరోగ్యం కేంద్రం పరిశీలన..
నెన్నెల, జూన్ 8 : నెన్నెల ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే చిన్నయ్య పరిశీలించారు. కరోనా నిర్ధారణ పరీక్షల తీరును పర్యవేక్షించారు. రోజుకు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారని వైద్యుడిని అడిగి తెలుసుకున్నారు. వైరస్పై అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను సైతం అప్రమత్తం చేయాలన్నారు. మొదటి డోసు తీసుకున్న వారు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. ఇక్కడి అన్ని గదులు తిరిగి పరిశీలించారు. నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఆయన వెంట డాక్టర్ అనీశ్, సూపర్వైజర్ వెంకట రమణ, మెర్సి, నాయకులు భీమాగౌడ్ ఉన్నారు.