ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమావేశం
ఆసిఫాబాద్టౌన్, మే 6 : జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఇరిగేషన్ శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు రైతులందరికీ సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నా రు. ఏవైనా ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాల్సి ఉంటే ఖరీఫ్ సీజన్ కంటే ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సక్కు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనేక మంది గిరిజనులు వ్యవసాయంపైన ఆధారపడి ఉన్నారని, సాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఇరిగేషన్ ఈఈ గుణవంత్ రావు, డీఈ, ఏఈ పాల్గొన్నారు.