మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
వెల్గనూర్, ధర్మారావుపేటలో రూ.9.02 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
దండేపల్లి, జూన్ 6: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. దండేపల్లి మండలం ధర్మారావుపేట నుంచి పెద్దపేట, లక్ష్మీకాంతాపూర్, మోకాసిగూడ వరకు రూ.3.39 కోట్లు, వెల్గనూర్ నుంచి రెబ్బెన్పెల్లి, ముత్యంపేట, కొర్విచెల్మ, కొత్తకొమ్ముగూడ వరకు రూ.5.63 కోట్ల పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలు, గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అవసరమైన చోట వంతెనలు నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. గూడెం ఎత్తిపోతలు, ఎల్లంపల్లి బ్యాక్వాటర్తో వందలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారుతున్నాయన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్లు కాసనగొట్టు లింగన్న, సురేశ్, వైస్చైర్మన్ రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, బండారి వెంకటేశ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్లు దాసరి దేవక్క, బిల్లకురి శంకరయ్య, కందుల కళ్యాణి, విఠల్, బాదినేని సత్యవతి, జాడి మాధవి, గడికొప్పుల రజిని, భీము, డాంక లక్ష్మణ్, ఉపసర్పంచ్లు కాండ్రపు లక్ష్మణ్, ముద్దసాని తిరుపతి, ఎంపీటీసీలు ముత్తె రాజన్న, బొడ్డు కమలాకర్, చుంచు మల్లవ్వ, బత్తుల మౌనిక, టీఆర్ఎస్ నాయకులు సత్యంరావు, వెంగళరావు, బండారి మల్లేశ్, ఆకుల రాజేందర్, కొట్టె సత్తన్న, జాడి ఇసాకర్, అఫ్సర్, తదితరులు పాల్గొన్నారు.