సావర్ఖేడ పాఠశాల హెచ్ఎం కడేర్ల రంగయ్యకు జాతీయ అవార్డు
వర్చువల్ విధానంలో రాష్ట్రపతి ద్వారా అందుకున్న టీచర్
రాష్ట్రస్థాయిలో మరో ముగ్గురికి పురస్కారాలు
ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 5: కెరమెరి మండలంలోని సావర్ఖేడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్య జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా వర్చువల్ విధానంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ద్వారా ఆదివారం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో కొద్దిసేపు మాట్లాడారు. దీంతో పాటు బూరుగూడ జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఉదయ్బాబు, జన్కాపూర్ జడ్పీ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు హైదారాబాద్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీ నివాస్ యాదవ్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొంద డం సంతోషంగా ఉందని, ఇది తమ మీద మరిం త బాధ్యతను పెంచిందని వారు పేర్కొన్నారు.
ముత్యంపల్లి జడ్పీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్..
కాసిపేట, సెప్టెంబర్ 5 : మండలంలోని ముత్యంపల్లి జడ్పీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బండ శాం కరి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా హైదరాబాద్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆదివారం అవార్డును స్వీకరించారు. శాంకరి సైన్స్ అంశాల్లో ప్రతిభ చూ పడంతో పాటు పలు సేవా రంగాల్లో సైతం విశిష్ట సేవలు అందించింది. సైన్స్ ఫెయిర్లో జాతీయ స్థాయిలో గుర్తింపు, ఇండియన్ టాయ్ ఫేర్లో తోలు బొమ్మలటలతో విద్యార్థులకు పాఠ్యాంశాలు ,బోధనపై స్పెషల్ వీడియో ప్రదర్శన, సైన్స్ ఫేర్లో తోలు బొమ్మలకు సంబంధించి సదురు ఉ పాధ్యాయురాలు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న విద్యార్థిని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేగాకుండా జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం, ఎన్సీఆర్టీలో సైతం సైన్స్ అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. ప లుమార్లు జిల్లా, రాష్ట్ర అవార్డులను అందుకున్నా రు. రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడంపై తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.