కుమ్రం భీం ఆసిఫాబాద్ డీఎంహెచ్వో మనోహర్
జైనూర్లో పీహెచ్సీ సిబ్బందికి శిక్షణ
జైనూర్, ఆగస్టు 5: చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధిని అరికట్టేందుకు నూతనంగా ప్రవేశపెడుతున్న వ్యాక్సిన్పై పూర్తి అవగాహన ఉండాలని డీఎంహెచ్వో కుడ్మెత మనోహర్ అన్నారు. జైనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సముదాయ భవనంలో జైనూర్, ఉషెగాం, సిర్పూర్-(యూ), లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్య సిబ్బందికు గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ చిన్నారుల్లో న్యోమోకొకస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే శ్వాసకోశ వాధి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నదన్నారు. వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్, మండల వైద్యాధికారి సిడాం నాగేంద్ర, వైద్యులు నరేశ్, నాగర్గోజె అశోక్, నవీన్, హెచ్ఎస్లు కిశోర్, లక్ష్మీకుమారి, రమేశ్, హెచ్ఏలు, ఏఎన్ఎంలు, తదితరులు ఉన్నారు.
తల్లిపాలతో రోగనిరోధక శక్తి :
మంచిర్యాల డీఎంహెచ్వో సుబ్బారాయుడు
సీసీసీ నస్పూర్, ఆగస్టు 5 : తల్లిపాలతోనే పుట్టినబిడ్డకు రోగనిరోధక శక్తి పెంపొందుతుందని మంచిర్యాల డీఎంహెచ్వో సుబ్బారాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని సీసీసీ నస్పూర్ నర్సయ్యభవన్లో పీహెచ్సీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వారోత్సవాలకు సంబంధించిన వివరాలను అంగన్వాడీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకనుగుణంగా సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్లు నీరజ, అనిత, ఆన్లైన్ ప్రోగ్రాం అధికారి చారి, శేఖర్, న స్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్చన పాల్గొన్నారు.