అన్ని గ్రామాల్లో పాదయాత్ర లు..
పరిశుభ్రత పాటించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలు
ఆయా చోట్ల పనులు..
కెరమెరి, జూన్ 4 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం పారిశుధ్యంపై అవగాహన ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా సంబంధిత సర్పంచ్లు, కార్యదర్శులు పాదయాత్ర నిర్వహిస్తూ, ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఇందులో భాగంగా కెరమెరి మండలంలో సర్పంచ్లు, కార్యదర్శులు అవగాహన ర్యాలీలు చేపట్టారు. ప్రతి రోజూ ఇంట్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి జీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుండీల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జీపీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్, జూన్ 4 : మండలంలోని పారిశుధ్యంపై అధికారులు అవగాహన ర్యాలీ తీశారు. తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో ప్రసాద్ గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.
కౌటాల, జూన్ 4 : మండల కేంద్రంలో సర్పంచ్ వొజ్జల మౌనిష్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పలు వార్డులో పారిశుధ్య పనులు నిర్వహించారు. గ్రామంలోని బీసీ (బారే) వాడలోని మురుగుకాలువల్లో చెత్త తొలగించారు. అలాగే మార్కెట్ ఏరియాలో రూ.3 లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఉప సర్పంచ్ పసునూరి తిరుపతి, కార్యదర్శి సాయికృష్ణ, వార్డు సభ్యుడు అశోక్, నాయకులు గట్టయ్య, ముత్తయ్య, రవి తదితరులున్నారు.
పెంచికల్పేట్, జూన్ 4 : మండలంలోని అన్ని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. డ్రైనేజీల పూడికతీత, చెత్తాచెదారం తొలగింపు, డంప్యార్డులకు ట్రాక్టర్ ద్వారా తరలింపు, క్లోరినేషన్ చేయించారు. సర్పంచ్లు దుర్గం రాజన్న, ఉపాసి సంజీవ్, జాజిమొగ్గ శ్రీనివాస్, చంద్రమొగిలి, కావ్య, కమల, కార్యదర్శులు శ్రీకాంత్, సల్మా, ధర్మయ్య, వెంకటేశ్, జావీద్, గ్రామస్తులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వార్డు సభ్యులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
రెబ్బెన, జూన్ 4 : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సర్పంచ్లు చెన్న సోమశేఖర్, పోటు సుమలత, బొమ్మినేని అహల్యాదేవి, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, దుర్గం శ్రీవాణి, లావుడ్య సాగరమ్మ, ఉప సర్పంచ్లు దేవానంద్, శ్రీనివాసగౌడ్, అశోక్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.