కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సుధీంద్ర
సావర్ఖేడ గ్రామంలో 54 కిలోల గంజాయి పట్టివేత
పోలీస్ స్టేషన్లో వివరాల వెల్లడి
కెరమెరి, మే 31: అక్రమదందాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ సుధీంద్ర పేర్కొన్నా రు. మండలంలోని సావర్ఖేడ్ గ్రామంలో గంజా యి తరలస్తూ పట్టుబడ్డ నిందితుల వివరాలను పోలీసు స్టేషన్లో సోమవారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సా వర్ఖేడ గ్రామం నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమేశ్ గుడిహత్నూర్కు చెందిన రవీందర్, సావర్ఖేడ్కు చెందిన శ్రీకాంత్ కారును తనిఖీ చేయగా రెండు కిలోల గంజాయి లభించిందన్నారు. దీంతో వారిని విచారించామన్నారు. తర్వాత అదే గ్రామానికి చెందిన ఆదే తుకారాం, వాడై భిక్కు ఇంట్లో సోదాలు నిర్వహించగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ 3. 78 లక్షల విలువైన 54 కిలోల గంజాయిని కూడా పట్టుకున్నారన్నారు. అనంతరం తహసీల్దార్ సమీర్ అహ్మద్ఖాన్ సమక్షంలో పంచనామా చేసి గంజాయిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారమని చెప్పా రు. నిషేధిత వస్తువులను సాగు చేసిన, రవాణ చేసిన తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. గ్రామంలో ఇంకా ఎవరైనా అక్రమ దందా చేయాలని చూస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితులైన రవీందర్, శ్రీకాంత్, ఆదే తుకారాం, వాడై భిక్కులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ రమేశ్, సిబ్బంది ఉన్నారు.