గతేడాది కంటే 16 శాతం అదనం
శ్రీరాంపూర్లో 62 శాతం ఉత్పత్తి
శ్రీరాంపూర్ జీఎం సురేశ్
శ్రీరాంపూర్, ఏప్రిల్ 30 : సింగరేణివ్యాప్తంగా 2021-22 వార్షిక సంవత్సరం ఏప్రిల్లో 88 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని శ్రీరాంపూర్ జీఎం ఎం సురేశ్ పేర్కొన్నారు. జీఎం ఆఫీస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది కంటే ఈ నెలలో 16 శా తం అదనంగా ఉత్పత్తి సాధించామన్నారు. శ్రీ రాంపూర్ ఏరియాలో 62 శాతం, కొత్తగూడెంలో 100 శాతం, ఇల్లందులో 83 శాతం, మణుగూరులో 114 శాతం, ఆర్జీ-1లో 88 శాతం, ఆర్జీ-2లో 97 శాతం, ఆర్జీ-3 ఏరియాలో 82 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టులో 54 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు వివరించారు. భూపాలపల్లి ఏరియా లో 42 శాతం, బెల్లంపల్లి డివిజన్లో 79 శాతం, మందమర్రి ఏరియాలో 95 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కరోనా వైరస్ నివారణకు జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. డీవైజీఎం గోవిందరాజు, ఎస్వోటూ జీఎం గుప్తా, డీవైజీఎం చిరంజీవులు పాల్గొన్నారు.
పెరిగిన బొగ్గు ఉత్పత్తి..
మందమర్రి రూరల్, ఏప్రిల్ 30 : ఏప్రిల్ నెలలో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని ఆరు గనులు 72 శాతం ఉత్పత్తి సాధించగా, ఆర్కేపీ, కేకే ఓసీలు 102 శాతం ఉత్పత్తిని సాధించి మొత్తంగా ఏరియాలో 94 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. కేకే 1 గని లక్ష్యం 13,000 టన్నులు ఉండగా, 13,464 టన్నులు (104) శాతం, ఆర్కే ఓసీ 50,000 టన్నులకు 62,705 టన్నులు (125 శాతం) ఉత్పత్తి సాధించిందన్నారు. ఆయనతో పాటు ఇన్చార్జి పీఎం ఎస్. శ్యామ్ సుందర్, డిప్యూటీ ఎస్ఈ (ఐఈ) ఫణికుమార్ ఉన్నారు.