కాగజ్నగర్టౌన్ , మే 1: పట్టణంలో మే డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్, ఎస్పీఎం గేటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ కార్యాలయం, సీపీఎం,సీఐటీయూ కార్యాలయాల ఎదుట జెండాలు ఆవిష్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు కూశన రాజన్న, శంకరమ్మ, ముంజం ఆనందన్కుమార్, గులాం దస్తగిరి, ముంజం శ్రీనివాస్, రాయుడు చంద్రశేఖర్, సంజీవ్, పద్మ, కోట శ్రీనివాస్, రవి, చంద్రయ్య, మల్లయ్య , రాంప్రకాశ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్,మే1: జిల్లాకేంద్రంలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాలను ఆవిష్కరించారు. బూరుగూడ సబ్ స్టేషన్ విద్యుత్ శాఖ అధికారులు, ఆర్టీసీ డిపోలో కార్మికులు, ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో విలాస్, ప్రతాప్, సురేశ్, తిరుపతి, శ్రీనివాస్, ఉపేందర్, దినాకర్, లోకేశ్, కార్మికులు పాల్గొన్నారు.
కౌటాల, మే 1: మండలకేంద్రంలో సీఐటీయూ నాయకుడు జాడి మోరేశ్వర్ కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మోర్లె నాగేశ్, విఠల్, వెంకటి, ఆశ వర్కర్ మోగ్రా ఉన్నారు.
రెబ్బెన,మే1: మండలంలో మేడే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గోలేటి తెలంగాణభవన్లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కైర్గూడ ఓసీపీ లో పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేశం, వర్క్షాప్లో ఆర్గనైజింగ్ కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, సీహెచ్పీలో పిట్ కార్యదర్శి మెరుగు రమేశ్, సీపీఐ జెండాను కార్యదర్శి దుర్గం రవీందర్, ఏఐటీయూసీ జెండాను కార్యదర్శి ఎస్.తిరుపతి, హెచ్ఎంఎస్ జెండాను ఉపాధ్యక్షుడు పత్తెం రాజబాబు, ఐఎఫ్టీయూ జెండాను డివిజన్ అధ్యక్షుడు బండారి తిరుపతి వేర్వేరు చోట్ల ఆవిష్కరించి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు అబ్బు శ్రీనివాసరెడ్డి, మారిన వెంకటేశ్, మహేందర్రెడ్డి, బోగే ఉపేందర్, మంతెన వేణు, ఇనూస్, రహీం, రవికుమార్, మంతు సమ్మయ్య, వినయ్కుమార్, సంపత్, ఓరం కిరణ్, బొంగు వెంకటేశ్, భాస్కరాచారి పాల్గొన్నారు.