పాలకుర్తి, అక్టోబర్ 16: దసరా సంబురాలు శుక్రవారం అంబరాన్నంటాయి. కొన్నిచోట్ల ఉదయం, మరికొన్ని చోట్ల సాయంత్రం శమీ పూజలు భక్తిశ్రద్ధలతో సాగగా, రాత్రివేళ నిర్వహించిన ‘రావణవధ’ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆయుధ, వాహన పూజలు, దర్శనాలతో దేవాలయాలు కిటకిటలాడాయి. ఓరుగల్లులోని రంగలీల మైదానం, తొర్రూరులోని శక్తిస్థల్, యతిరాజారావు పార్కు ఆవరణల్లో నిర్వహించిన రావణవధ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంటలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జమున, స్టేషన్ఘన్పూర్లో నిర్వహించిన ఉత్సవానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఆయా మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కొత్త ఉత్సాహం నింపారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంతో పా టు వివిధ గ్రామాల్లో దసరా వేడుకలు ప్రజా ప్రతి నిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పాలకుర్తిలో సర్పంచ్ వీరమనేని యా కాంతరావు ఆధ్వర్యంలో స్థానిక బొడ్రా యి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి డప్పు చప్పుళ్లతో వివిధ రాజకీయ నాయకులు, ప్రజలు కలిసి ర్యాలీ ప్రదర్శనతో గ్రామ పంచాయతీ, ఓంకారేశ్వర ఆలయం వరకు తరలి వెళ్లా రు. ఓంకారేశ్వర ఆలయం వద్ద జమ్మి చెట్టు వద్ద పూజాలు ప్రత్యేక పూజలు చేశారు. గౌడ యూత్ ఆధ్వర్యంలో గౌడ కాలనిలో దుర్గా మాత శ్రీరాజా రాజశ్వేరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. మహాపూర్ణాహుతి, కుంకుమార్చన పూజ లు నిర్వహించారు. క్రాంతి యూత్, యువ చైతన్యయూత్ ఆధ్వర్యంలో శాంతినగర్లో ఏర్పాటు చేసిన దుర్గా మాత వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు జమ్మి ఆకును వెంట తీసుకొని ఆడ పడుచులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
అవాంచనీయ సం ఘటనలు జరగకుండా ఎస్సై వంశీకృష్ణ ముందస్తు చర్యలు చేపట్టారు. మండలంలో మం చుప్పుల గ్రామంలో విజయ దశమిని పురస్కరించుకొని సోరకాయను బలిచ్చి వేడుకలను ఘనం గా నిర్వహించారు. చెన్నూరు, గూడూరు, వావిలాల, దర్ధేపల్లి, విస్నూరు, బమ్మెర, వల్మిడి, ము త్తారం, మల్లంపెల్లి గ్రామాల్లో దసర ఉత్సవాలను ఘనం గా నిర్వహించారు. ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీఫ్లోర్లీడర్ పుస్కూరి శ్రీనివాస్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్కుమార్, ఆ యా గ్రామాల్లో నిర్వహించిన దసర వేడుకల్లో సర్పంచ్లు ఇమ్మడి ప్రకాశ్, బొమ్మగాని కొమురయ్య, పుస్కూరి పార్వతి రాజేశ్వరి, భాస్కర్రెడి గంట పద్మ, పుస్కూరి భాస్కర్రెడ్డి, పుస్కూరి కళికంగరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : మండల వ్యాప్తం గా శుక్రవారం దసరా వేడుకలు ఘనంగా జరిగా యి. ప్రజలు పాలపిట్ట, గరుత్మాంతుడి దర్శనం అ నంతరం గ్రా మ కూడలిలో జమ్మిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలు దస రా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయగా, పోలీసులు మండల వ్యా ప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు పటాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు.
పోలీస్స్టేషన్లో ఆయుధ పూజ..
దేవరుప్పుల పోలీస్స్టేషన్లో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆయుధపూజ చేశారు. ఎస్సై రాజు నేతృత్వంలో పూజలు నిర్వహించారు. పురోహితుడు రమేశ్శర్మ ఆయుధ పూజ చేయించగా, ఏఎస్సై నరోత్తం రెడ్డి, హెడ్కానిస్టేబుల్ సంపత్, కానిస్టేబుళ్లు రమేశ్, సుధాకర్, ఉపేందర్, అశోక్, పాషా, గౌస్ ఉన్నారు.
జనగామ రూరల్ : దసరా ఉత్సవాలు ఘ నంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మిచెట్టు వద్దకు గ్రామస్తులతో కలసి వెళ్లారు. కొన్ని గ్రామాల్లో ఉదయం, సాయంత్రం దసరా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల కలింగరాజు, మార్కెట్ చైర్ పర్సన్ బాల్ది విజయ సిద్దిలింగం, సర్పంచ్లు, ఎంపీటీసీలు అంబాల ఆంజనేయులు గౌడ్, మూలరవిగౌడ్, బొల్లం శారద, బండ లక్ష్మీవెంకటేశం, సుంకరి నిర్మల, కొత్త దీపక్రెడ్డి, గండి లావణ్యప్రవీన్, శానబోయిన శ్రీనివాస్, శివరాత్రి స్వప్నరాజు, మాండ్ర రవికుమార్, జయరాం, ఎళ్ల సుజాత, ఉప సర్పంచ్లు చినబోయిన రేఖరాజు, అనిల్, ఉపేందర్ రెడ్డి, లలిత, పుప్పాల కరుణాకర్, మడిపల్లి సుధాకర్గౌడ్, బోళ్ల అంజయ్య, గాజుల నరేశ్యాదవ్, బనుక భిక్షపతి, ప్రశాంత్, రవీందర్, రజాక్, మహేందర్, బీరయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి: మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లో శుక్రవారం దసరా వేడుకలను మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో దసరా వేడుకలను జరుపుకునే ప్రదేశంలో గ్రామదేవతకు మేకలు, గొర్రెలు, సోరకాయలను బలించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితుల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో జమ్మిపూజ నిర్వహించగా, ప్రజలు జమ్మి ఆకును తీసుకొన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు జమ్మిపెట్టి ఆలాయి బలాయి తీసుకుని తన ఆత్మీయతను పంచుకుని పాలపిట్టను తిలకించేందుకు పొలాలు, అడవి ప్రాంతాన్నికి తరలివెళ్లి ఆనందించారు. రఘునాథపల్లిలో జడ్పీటీసీ బొల్లం అజయ్కుమా ర్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, కోమాల్ల ఎంపీపీ మేకల వరలక్ష్మి, జాఫర్గూడెం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వారాల రమేశ్, నిడిగొండలో స్ట్టేషన్ఘన్ఫూర్ నియోజకవర్గం ఇన్చార్జి మడ్లపల్లి సునిత ఆయా గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నర్మెట: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో దసరా వేడుకలను ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా సంప్రదాయం ప్రకారం.. గ్రామదేవతల వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు జమ్మిని ఇచ్చిపుచ్చుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో సీఐ కర్ణాకర్, ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ చేశారు. సాయంత్రం వేళ గ్రామస్తులందరూ కలిసి జమ్మి ఆకు కొరకు వెళ్లి, పాలపిట్టను చూసేందుకు తరలివెళ్లారు.
జఫర్గఢ్: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు శుక్రవారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఊరు, వాడా ఏకమై విజయదశమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘణంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల చావిడీలలో సోరకాయను నరికి దసరా వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
కొడకండ్ల: మండల కేంద్రంలో సర్పంచ్ పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆయుధపూజలు ని ర్వహించారు. అదే విధంగా నర్సింగాపురం గ్రా మంలో సర్పంచ్ దండెంపల్లి శ్రీలత ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఎస్సై పవన్కుమార్ పర్యవేక్షణలో మండల వ్యాప్తంగా ప్రశాంతంగా వేడుకలు నిర్వహించారు. అదే విధంగా మండల కేంద్రంలో స్నేహయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు పూజలందుకుని శనివా రం శోభాయాత్రతో నవరాత్రి ఉత్సవాలు ముగించారు.